ఎన్టీఆర్‌ రూల్.. ‘పాన్‌ ఇండియా’ కాదు ‘కంటెంట్‌’ ముఖ్యం..!

ఇప్పుడు అన్ని భాషల్లోని స్టార్ హీరోలు పాన్‌ ఇండియా బాట పడుతున్నారు. తమ మాతృ భాషతో పాటు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకోవాలని ఉవ్విలూరుతున్నారు

ఎన్టీఆర్‌ రూల్.. 'పాన్‌ ఇండియా' కాదు 'కంటెంట్‌' ముఖ్యం..!
Follow us

| Edited By:

Updated on: May 11, 2020 | 3:28 PM

ఇప్పుడు అన్ని భాషల్లోని స్టార్ హీరోలు పాన్‌ ఇండియా బాట పడుతున్నారు. తమ మాతృ భాషతో పాటు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకోవాలని ఉవ్విలూరుతున్నారు. ఇందుకు తెలుగు హీరోలు కూడా మినహాయింపు కాదు. ఇప్పటికే ప్రభాస్ పాన్‌ ఇండియా హీరోగా పేరు సంపాదించుకోగా.. ఇప్పుడు అల్లు అర్జున్, విజయ్‌ దేవరకొండలు కూడా అదే బాటలో ఉన్నారు. అయితే పాన్‌ ఇండియా విషయంలో ఎన్టీఆర్‌ లెక్కలు వేరని తెలుస్తోంది. పాన్ ఇండియా కంటే కంటెంట్‌వైపునే యంగ్ టైగర్ మొగ్గుచూపుతున్నారని సమాచారం.

ప్రస్తుతం ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లు కలిసి ఆర్ఆర్ఆర్‌లో నటిస్తుండగా.. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు యంగ్ టైగర్. ఆర్ఆర్ఆర్‌ ఎలాగూ పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది కాబట్టి.. తరువాత తాను నటించే సినిమాలను పాన్‌ ఇండియాగా విడుదల చేయొచ్చు. కానీ ఆ ఆలోచనలు ఎన్టీఆర్‌కు లేవట. కేవలం తెలుగులోనే ఈ సినిమాను విడుదల చేయాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేజీఎఫ్‌ ఫేమ్ ప్రశాంత్ నీల్, తమిళ దర్శకుడు అట్లీ.. ఎన్టీఆర్‌తో పాన్‌ ఇండియా సినిమాలు తీయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ పక్కనపెడితే పాన్ ఇండియా అన్న దాని కంటే కంటెంట్‌నే ముఖ్యం అని ఎన్టీఆర్‌ రూల్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కంటెంట్ ఉంటేనే దర్శకులకు ఓకే చెప్పాలని ఆయన భావిస్తున్నారట.

Read This Story Also: ‘పుష్ప’ విషయంలో ప్లాన్ మార్చుకున్న సుకుమార్..!