Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan : కొంపముంచిన ఓల్డ్ ట్వీట్.. హీరోయిన్‌‌‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే..

ఒకప్పుడు ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ ఉన్న బ్యూటీ ఇప్పుడు వరుస హిట్ లతో ఇప్పుడు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది శ్రుతిహాసన్. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తున్న శ్రుతి

Shruti Haasan : కొంపముంచిన ఓల్డ్ ట్వీట్.. హీరోయిన్‌‌‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే..
shruti-haasan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 30, 2021 | 12:23 PM

Shruti Haasan : ఒకప్పుడు ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ ఉన్న బ్యూటీ ఇప్పుడు వరుస హిట్ లతో ఇప్పుడు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది శ్రుతిహాసన్. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తున్న శ్రుతి. పలు బాలీవుడ్ సినిమాల్లోనూ మెరిసింది. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే మాస్ రాజా నటించిన క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకున్న శ్రుతి. ప్రస్తుతం పవర్ స్టార్ సరసన వకీల్ సాబ్ సినిమాలో నటిస్తుంది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. కాగా ఇప్పుడు శ్రుతిహాసన్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే..

గతంలో శ్రుతిహాసన్  చేసిన ఓ ట్వీట్ దీనికి కారణమని తెలుస్తుంది.. ఆ ట్వీట్ లో తన ఫ్యూచర్ లో కన్నడ సినిమాలు చేయనని, ఇప్పుడప్పుడే కన్నడలో సినిమాలు చేసే ఆలోచనకూడా లేదని అన్నదట శ్రుతి. అయితే ఆమె ఆట్వీట్ ‘పొగరు’ అనే సినిమా గురించి చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు శ్రుతి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కన్నడ సినిమాలు చేయనున్న శ్రుతి ఇప్పుడు కన్నడ దర్శకుడు తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమాలో ఎలా నటిస్తుందని కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారని తెలుస్తుంది. మరి ఈ ట్రోల్స్ పై శ్రుతిహాసన్ స్పందిస్తుదేమోచూడాలి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi’s ‘Acharya’ : మెగాస్టార్ ‘ఆచార్య’ సెట్‌‌‌‌‌‌లో ప్రత్యక్షమైన తెలంగాణ రవాణా శాఖ మంత్రి..