ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్ చెప్పిన నాగ్ అశ్విన్.. డేట్స్‏ రివీల్ చేసిన డైరెక్టర్.. అభిమానులకే ఇక పండగే..

|

Jan 23, 2021 | 6:06 PM

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‏తో ఓ సినిమా తీయబోతున్నానని

ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్ చెప్పిన నాగ్ అశ్విన్.. డేట్స్‏ రివీల్ చేసిన డైరెక్టర్.. అభిమానులకే ఇక పండగే..
Follow us on

Prabhas And Nag Ashwin Movie Update:  పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‏తో ఓ సినిమా తీయబోతున్నానని డేట్స్‏తో సహ ప్రకటించాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్‏తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇందులో నటి దీపికా పదుకొణె హీరోయిన్‏గా నటిస్తుంది. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.

ఇక సంక్రాంతి పండుగ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్‏డేట్ ఇస్తానని నాగ్ అశ్విన్ ఈ సంవత్సరం ఆరంభంలో చెప్పారు. అయితే పండగ వెళ్ళి పదిరోజులు కావోస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో నెటిజన్లు ట్విట్టర్‏లో మీమ్స్ మరియు కామెంట్లు చేస్తున్నారు.  దీంతో నాగ్ అశ్వీన్ స్పందిస్తూ… “జనవరి 29న ఒకటి, ఫిబ్రవరి 26న ఒకటి.. కచ్చితంగా అప్‏డేట్‏లు ఉంటాయని” సమాధానమిచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ పూర్తైన సంగతి తెలిసిందే. ఈ మూవీ అనంతరం ‘సలార్’ మూవీ చిత్రీకరణ కోసం ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. అలాగే ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్.

Also Read:

Prabhas’s Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని భయం