Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైరెక్టర్ శంకర్ ఆస్తుల జప్తు కేసు మరో మలుపు.. మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు

'ఎంథిరన్' చిత్ర వివాదం, శంకర్ ఆస్తి స్తంభింపజేసినట్లు వచ్చిన వార్తలు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించాయి. ఇప్పుడు హైకోర్టు నిర్ణయంతో ఈ విషయం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును సినీ పరిశ్రమకు చెందిన వారు, శంకర్ అభిమానులు షాక్ అయ్యేలా చేసింది. తాజా హైకోర్టు ఉత్తర్వులతో శంకర్‌కు ఊరట లభించింది.

డైరెక్టర్ శంకర్ ఆస్తుల జప్తు కేసు మరో మలుపు.. మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు
Director Shankar
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 12, 2025 | 2:20 PM

ప్రముఖ సినీ దర్శకుడు శంకర్‌కు మద్రాస్ హైకోర్టు నుండి పెద్ద ఊరట లభించింది. శంకర్ స్థిర, చరాస్తులను జప్తు జేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తీసుకున్న నిర్ణయంపై కోర్టు మధ్యంతర స్టే విధించింది. సూపర్ హిట్ చిత్రం ‘ఎంథిరన్’లోని ఆర్థిక అవకతవకలు జరిగియంటూ డైరెక్టర్ శంకర్‌పై కేసు నమోదైంది.

శంకర్ దర్శకత్వం వహించిన ‘ఎందిరన్’ చిత్రంలో రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని హిందీలో ‘రోబోట్’ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివాదం కారణంగా, శంకర్‌కు చెందిన రూ.11.10 కోట్ల విలువైన ఆస్తులను ED జప్తు చేసింది. అయితే, తాజాగా హైకోర్టు నిర్ణయం నుండి శంకర్‌కు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు, ఈ విషయానికి సంబంధించిన ప్రైవేట్ ఫిర్యాదుపై ఇప్పటికే స్టే విధించింది. శంకర్ ఆస్తిని స్తంభింపజేయడం సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది.

“ఒక ప్రైవేట్ ఫిర్యాదుపై స్టే విధించినప్పుడు, డైరెక్టర్ ఆస్తిని స్తంభింపజేయడం సముచితం కాదు” అని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. ED చర్యను సవాలు చేస్తూ శంకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం శంకర్ కు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. అయితే, ఈ విషయంలో చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుంది.

‘ఎంథిరన్’ వివాదం, శంకర్ ఆస్తి స్తంభింపజేసినట్లు వచ్చిన వార్తలు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించాయి. ఇప్పుడు హైకోర్టు నిర్ణయంతో ఈ విషయం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును సినీ పరిశ్రమకు చెందిన వారు, శంకర్ అభిమానులు నిశితంగా గమనిస్తున్నారు. వర్క్ ఫ్రంట్ గురించి చెప్పాలంటే, ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ‘గేమ్ ఛేంజర్’ విడుదలైంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, రామ్ చరణ్ నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..