‘బాహుబలి’ నిర్మాతలతో క్రిష్..?
‘మణికర్ణిక’, ‘యన్టిఆర్’ చిత్రాల కోసం దాదాపు ఏడాదిన్నరగా బిజీగా ఉన్నాడు దర్శకుడు క్రిష్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానాయకుడు’ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విడుదలైన ప్రతి చోట ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజులు విరామం తీసుకోనున్న క్రిష్.. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నారట. ఈ క్రమంలో బాహుబలి నిర్మాతలతో(ఆర్కా మీడియా) క్రిష్ పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్ దగ్గర కొన్ని స్క్రిప్ట్లు సిద్ధంగా ఉండగా.. వాటి మీద కసరత్తు […]
‘మణికర్ణిక’, ‘యన్టిఆర్’ చిత్రాల కోసం దాదాపు ఏడాదిన్నరగా బిజీగా ఉన్నాడు దర్శకుడు క్రిష్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానాయకుడు’ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విడుదలైన ప్రతి చోట ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజులు విరామం తీసుకోనున్న క్రిష్.. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నారట.
ఈ క్రమంలో బాహుబలి నిర్మాతలతో(ఆర్కా మీడియా) క్రిష్ పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్ దగ్గర కొన్ని స్క్రిప్ట్లు సిద్ధంగా ఉండగా.. వాటి మీద కసరత్తు చేసి ఒకటి ఫైనల్ చేయనున్నాడట. అది పూర్తి కాగానే ఆర్కా మీడియాలో క్రిష్ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా మరోవైపు తన సొంత బ్యానర్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో కూడా క్రిష్ ఓ చిత్రాన్ని చేయనున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.