ప్రభాస్, ఎన్టీఆర్‌లతో సినిమాలపై ‘కేజీఎఫ్’ దర్శకుడి స్పందన

కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపును సాధించుకున్న ప్రశాంత్ నీల్‌, ప్రస్తుతం ఆ మూవీ సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్, ఎన్టీఆర్‌లతో సినిమాలపై 'కేజీఎఫ్' దర్శకుడి స్పందన
Follow us

| Edited By:

Updated on: Oct 10, 2020 | 12:45 PM

KGF Director Prashanth Neel: కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపును సాధించుకున్న ప్రశాంత్ నీల్‌, ప్రస్తుతం ఆ మూవీ సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్‌కి వచ్చేయగా.. కుదిరితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ చిత్రీకరణలో ఉండగానే ప్రశాంత్ నీల్ తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. మఖ్యంగా ప్రశాంత్‌ కోసం పలువురు టాలీవుడ్ నిర్మాతలు లైన్‌లో ఉన్నారని.. కేజీఎఫ్ తరువాత ఎన్టీఆర్, ప్రభాస్‌లతో ఆయన సినిమాలను తీయబోతున్నారని టాక్ నడిచింది. అంతేనా ఎన్టీఆర్‌తో సైన్స్ ఫిక్షన్, ప్రభాస్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్ తీయనున్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే మరోవైపు ప్రశాంత్‌, టాలీవుడ్‌లో సినిమాలు తీస్తున్నాడని తెలియడంతో కన్నడ నాట తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ఒకానొక సమయంలో కన్నడ ప్రేక్షకులు ప్రశాంత్‌ నీల్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్లు పెట్టారు. దాంతో ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను కన్నడ సినీ పరిశ్రమకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని.. ఎవరితో చేసినా కన్నడ భాషల్లోనే ఉంటుందని చెప్పారు.

అయినా ప్రశాంత్‌ నీల్‌ తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల ప్రశాంత్ చేసిన ఓ పోస్ట్‌కు ఓ నెటిజన్‌ మీరు ప్రభాస్‌తో ముందు పనిచేస్తారా..? ఎన్టీఆర్‌తో పనిచేస్తారా..? అని ప్రశ్నించారు. దానికి స్పందించిన ప్రశాంత్.. నా తదుపరి ప్రాజెక్ట్‌లు కేజీఎఫ్‌ 2 బాధ్యతలన్నీ ముగిసిన తరువాతే చెప్తాను. థ్యాంక్యు అని కామెంట్ పెట్టారు. మరి ప్రశాంత్ తదుపరి చిత్రం ఎవరితో ఉంటుంది..? అన్నది తెలియాలంటే ఇంకో మూడు, నాలుగు నెలలు ఆగాల్సిందే.

Read more:

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల స్కాం.. ప్రొద్దుటూరు కేంద్రంగా సాగిన కుంభకోణం

కరోనా నుంచి కోలుకున్న పిల్లల్లోనూ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌

Latest Articles