ప్రారంభమైన ‘కేజీఎఫ్ 2’
గతేడాది చివర్లో వచ్చిన కేజీఎఫ్ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో ఈ మూవీ రెండో భాగాన్ని ఇవాళ ప్రారంభించారు. బెంగళూరు కంఠీరవ స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో ఉదయం 9.30కు రెండో భాగాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ తనయుడు.. `కెజిఎఫ్ 2` ఎగ్జిక్యూటివ్ […]
గతేడాది చివర్లో వచ్చిన కేజీఎఫ్ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో ఈ మూవీ రెండో భాగాన్ని ఇవాళ ప్రారంభించారు. బెంగళూరు కంఠీరవ స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో ఉదయం 9.30కు రెండో భాగాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ తనయుడు.. `కెజిఎఫ్ 2` ఎగ్జిక్యూటివ్ నిర్మాత కైకాల రామారావు, చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్, దర్శకుడు ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్, కథానాయిక శ్రీనిధి శెట్టి తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తారు. అక్టోబర్ తో చిత్రీకరణ పూర్తవుతుంది. నవంబర్ నుంచి సీజీ వర్క్ సహా నిర్మాణానంతర పనులు పూర్తి చేస్తారు. 2020 వేసవి కానుకగా సినిమా రిలీజవుతుంది. చాప్టర్ 1లో నటించిన స్టార్లు అంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖ స్టార్లు ఇందులో నటించనున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 1 చిత్రాన్ని ఎంతో ప్రేమించి అభిమానించిన అభిమానులకు చాప్టర్ 2 డబుల్ ట్రీట్ ఇస్తుందని ఈ సందర్భంగా హీరో యశ్ తెలిపారు.