టాలీవుడ్ హీరో నితన్ పై మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ పగ తీర్చుకుంటా అని అన్నారు. షూటింగ్ సమయంలో నిద్రపోకూడదనే గుణపాఠాన్ని నేర్చుకున్నానని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నితిన్తో ‘రంగ్దే’, మహేశ్బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాల్లో నటిస్తున్నారు.
‘రంగ్దే’ షూటింగ్ ప్రస్తుతం దుబాయిలో జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా సెట్లో కీర్తి నిద్రపోతుండగా ఫోటో తీసిన నితిన్.. దాన్ని సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోందంటూ కామెంట్ చేశాడు. ఈ సరదా ఫోటో సోషల్మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై స్పందించిన కీర్తి ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదని గుణపాఠం నేర్చుకున్నా. పగ తీర్చుకుంటా’ అని కామెంట్ చేసింది. దీంతో పాటు దుబాయిలోని అద్భుతమైన లొకేషన్లో దిగిన ఫోటోలను కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది.