AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెర్సీ డైరెక్టర్‏తో జతకట్టనున్న ‘చిరుత’.. వచ్చే ఏడాది సమ్మర్‏లో ప్రారంభంకానున్న షూటింగ్ ?..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం రామ్ చరణ్‏కి కరోనా పాజిటివ్ రావడంతో అటు

జెర్సీ డైరెక్టర్‏తో జతకట్టనున్న 'చిరుత'.. వచ్చే ఏడాది సమ్మర్‏లో ప్రారంభంకానున్న షూటింగ్ ?..
Rajitha Chanti
|

Updated on: Dec 29, 2020 | 10:41 AM

Share

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం రామ్ చరణ్‏కి కరోనా పాజిటివ్ రావడంతో అటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు తనను కలిసిన వారందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

తాజాగా చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్‏లో తర్వాత మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. ఫిబ్రవరి నాటికి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గోననున్నట్లుగా తెలుస్తోంది. కాగా అటు యువ దర్శకుడు జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి చరణ్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గౌతమ్ బాలీవుడ్‏లో జెర్సీ రీమేక్ చేస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. జెర్సీ రీమేక్ తర్వాత గౌతమ్, చరణ్‏తో సినిమా తీయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాను ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్నారు. అయితే వచ్చే ఏడాది సమ్మర్‏లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చరణ్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.