కృష్ణవంశీ డైరెక్షన్లో ‘అతిలోకసుందరి’ కూతురు.. ఫీమేల్ ఒరియంటెడ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ?
సినీ ఇండస్ట్రీలో ఆయన తీసే సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి. సినిమా తెరకెక్కించే ముందు ఆయన ప్రతి చిన్న విషయానికి ప్రాధాన్యత ఇస్తుంటారు.

Krishna Vamsi New Movie Update: సినీ ఇండస్ట్రీలో ఆయన తీసే సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి. సినిమా తెరకెక్కించే ముందు ఆయన ప్రతి చిన్న విషయానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. క్రియేటివ్గా సినిమాలను రూపొందించడంలో ఆయనే దిట్ట. అందుకే ఆయనకు చాలా మంది అభిమానులున్నారు. ఆయనేవరో కాదు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి ఈయనకు సరైన్ హిట్ రావట్లేదు. రామ్ చరణ్తో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తీసినా.. అది అంతగా హిట్ కాలేకపోయింది. తాజాగా కృష్ణ వంశీ మహిళా ప్రాధాన్యం ఉన్న కథతో ఓ సినిమా తెరకెక్కించనున్నట్లుగా టాక్. అయితే ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తే.. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ను ఎంపిక చేయనున్నట్లుగా ఫీల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది.
లాక్ డౌన్ సమయంలోనే ఓ కథను కృష్ణవంశీ సిద్ధం చేసుకున్నారట. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని సమాచారం. అయితే అటు బాలీవుడ్లో గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్ వంటి ఫీమేల్ ఓరియంటేడ్ సినిమాల్లో నటించిన జాన్వీకపూర్ అయితే ఈ స్టోరీకి సరిగ్గా సరిపోతుందని కృష్ణవంశీ భావిస్తున్నాడట. ఇప్పటికే జాన్వీ తండ్రి బోనీకపూర్తో చర్చించారట. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదట. ఇక బోనీ కపూర్ నిర్మాతగా హిందీలో కృష్ణవంశి డైరెక్షన్లో శక్తి, ది పవర్ అనే సినిమాలు తెరకెక్కించారు. ఈనేపథ్యంలోనే జాన్వీ కపూర్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఛాన్స్ కృష్ణవంశీకే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. అటు జాన్వీ కూడా ‘గుడ్ లక్ జెర్రీ’, ‘రూహి’, ‘దోస్తానా 2’ లాంటి సినిమాల్లో నటిస్తుంది.
Also Read: అచ్చం అమ్మలాగే : అతిలోక సుందరిని తలపించిన జాన్వీకపూర్ తాజా ఫోటోలు




