Pawan Kalyan-Rana Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -దగ్గుబాటి హీరో రానా కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కు ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. ఇందుకోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేస్తున్నారట. ఈ సినిమాల కోసం ఓ లాడ్జి సెటప్ ను రెడీ చేస్తున్నారు.
పవన్, రానాపై సుమారు 25 రోజులు లాడ్జి సెట్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. మరో వారం, పది రోజుల్లో సెట్ పూర్తి కావచ్చని సమాచారం. ఆతర్వాత శరవేగంగా షూటింగ్ చేయనున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా సాయి పల్లవి నటిస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయాన్నీ ఇంతవరకు చిత్రయూనిట్ అధికారికంగా అనౌన్స్ చేయలేదు. హైదరాబాద్ లో షూటింగ్ పూర్తయిన తర్వాత చిత్రయూనిట్ పొలాచ్చి వెళ్లనున్నారు. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Shyam Singha Roy : జోరు పెంచిన నేచురల్ స్టార్.. శరవేగంగా జరుగుతున్న‘శ్యామ్ సింగరాయ్’ షూటింగ్