నాని మల్టీస్టారర్‌లో ఆ ఇద్దరు..?

|

Apr 15, 2019 | 4:53 PM

హీరో నాని ప్రస్తుతం సుధీర్ బాబు తో కలిసి ‘వ్యూహం'(వర్కింగ్ టైటిల్) అనే మల్టీ స్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. నానికి ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్ మేన్’ వంటి హిట్స్ అందించిన ఇంద్రగంటి.. ‘సమ్మోహనం’ లాంటి హిట్ చిత్రాన్ని సుధీర్ బాబు కు అందించాడు. ఇక ఇప్పుడు వీరిద్దరితో మల్టీ స్టారర్ సినిమా రూపొందిస్తుండగా.. ఇక ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ సినిమాపై సర్వత్రా […]

నాని మల్టీస్టారర్‌లో ఆ ఇద్దరు..?
Follow us on

హీరో నాని ప్రస్తుతం సుధీర్ బాబు తో కలిసి ‘వ్యూహం'(వర్కింగ్ టైటిల్) అనే మల్టీ స్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. నానికి ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్ మేన్’ వంటి హిట్స్ అందించిన ఇంద్రగంటి.. ‘సమ్మోహనం’ లాంటి హిట్ చిత్రాన్ని సుధీర్ బాబు కు అందించాడు. ఇక ఇప్పుడు వీరిద్దరితో మల్టీ స్టారర్ సినిమా రూపొందిస్తుండగా.. ఇక ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరనేది… చిత్ర యూనిట్ అధికారక సమాచారం ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, అదితి రావు హైదరి లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ క్రేజీ మల్టీ స్టారర్ జూలై నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో నాని నెగటివ్ షేడ్ లో కనిపిస్తుండగా.. సుధీర్ బాబు ఓ పోలీస్ అధికారిగా కనిపిస్తాడని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.