Green India challenge : గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్ నందిత శ్వేత..

| Edited By: Venkata Narayana

Jan 24, 2021 | 7:27 AM

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. సామాన్యులు, సెలబ్రెటీలు అందరు మొక్కలు నాటుతున్నారు.

Green India challenge : గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్ నందిత శ్వేత..
Follow us on

Green India challenge : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. సామాన్యులు, సెలబ్రెటీలు అందరు మొక్కలు నాటుతున్నారు. పర్యావరణాన్ని రక్షించే సదుద్దేశంతో ప్రారంభమైన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఇప్పటికే సినిమా తారలు రాజకీయనాయకులు, క్రీడాకారులు పాల్గొంటున్నారు. తాజాగా నటి నందిత శ్వేత కూడా మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వతహాగా స్వీకరించిన నందిత శ్వేత ఇవాళ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ గురించి తెలుసుకొని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్ స్ఫూర్తితో మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌ కుమార్‌కు ఆమె అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సినీనటి ఐశ్వర్య రాజేశ్‌, హీరో నిఖిల్, డైరెక్టర్ ప్రశాంత్‌లకు ఆమె చాలెంజ్ విసిరారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mosagallu Movie Update: మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ విడుదల తేదీ ఖరారు ?.. ఆ రోజునే రాబోతుందంటూ..