AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రంగ్ దే’ టీమ్‌కి మళ్లీ ఇబ్బందులు..!

నితిన్‌, కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తోన్న లవ్‌ ఎంటర్‌టైనర్ రంగ్‌ దే. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో

'రంగ్ దే' టీమ్‌కి మళ్లీ ఇబ్బందులు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 30, 2020 | 11:07 AM

Share

Rang De Shooting: నితిన్‌, కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తోన్న లవ్‌ ఎంటర్‌టైనర్ రంగ్‌ దే. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో.. ఈ మూవీ కూడా ఆ మధ్యన సెట్స్ మీదకు వెళ్లింది. అంతేకాదు ఓ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు రంగ్‌ దేకి సంబంధించి ఒకే ఒక్క షెడ్యూల్‌ మాత్రమే మిగిలి ఉంది.

అందులో కొన్ని సన్నివేశాలతో పాటు పాటలు ఉన్నాయి. వాటిని ఇటలీలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావించింది. ఇక ఈ షూటింగ్‌ని పూర్తి చేసేందుకు ఈ వారంలోనే ఇటలీకి వెళ్లేందుకు ప్లాన్ చేసింది. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్‌ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. (IPl 2020: దినేష్ కార్తీక్‌, అంపైర్‌ మధ్య తెలుగు సంభాషణ.. వీడియో వైరల్‌)

ఇటలీలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వగా.. అక్కడి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. దీంతో రంగ్‌ దే టీమ్‌ ఇటలీ షెడ్యూల్‌ క్యాన్సిల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మిగిలిన చిత్రీకరణను దుబాయ్‌లో జరపాలని మూవీ యూనిట్ భావిస్తోందట. అయితే భారత్‌లో కేసుల దృష్ట్యా దుబాయ్ కూడా ఆ మధ్యన పలు ఆంక్షలు విధించింది. ఇలాంటి సమయంలో మరి మిగిలిన ఒకే ఒక్క షెడ్యూల్‌ని రంగ్‌ దే టీమ్‌ ఎక్కడ పూర్తి చేస్తుందో చూడాలి. కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.(ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం: పోస్కో)