AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైరాలో చెర్రీ నటించాల్సింది.. కానీ వద్దన్న చిరు.. ఎందుకంటే!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా'. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన

సైరాలో చెర్రీ నటించాల్సింది.. కానీ వద్దన్న చిరు.. ఎందుకంటే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 23, 2020 | 10:12 AM

Share

Chiranjeevi Sye Raa: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది విడుదల కాగా.. అందరినీ ఆకట్టుకుంది. కాగా మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ఈ మూవీని ఆయన తనయుడు రామ్ చరణ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఇందులో అమితాబ్ బచ్చన్‌,  జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్‌, నయనతార, తమన్నా ఇలా భారీ తారాగణం నటించగా.. రామ్ చరణ్ కూడా ఓ పాత్ర చేయాల్సి ఉందట.

ఇందులో ఇంటర్వెల్‌ బ్యాక్‌డ్రాప్ కోసం షేర్‌ఖాన్ అనే బలమైన పాత్రను దర్శకుడు సురేందర్ రెడ్డి రాశారట. ఆ పాత్ర కేవలం ఐదు నిమిషాలే ఉన్నప్పటికీ, చాలా కీలకమైనదట. ‘నరసింహారెడ్డి నీలాంటి వారు దేశానికి కావాలంటూ’ చివర్లో ఆ పాత్ర తనను తానే పొడుచుకొని చనిపోతుందట. అంతేకాదు ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లను కూడా సంప్రదించగా.. కొన్ని కారణాల వలన వారు ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్నారట. ఆ తరువాత ఈ పాత్రను చెర్రీతో చేయిస్తే బావుంటుందని సురేందర్ రెడ్డి చిరుకు తెలిపారట. కానీ అందుకు చిరు వద్దన్నారట.

తండ్రి కారణంగా తనయుడు చనిపోయే సన్నివేశాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారో..? లేదో..? అన్న అనుమానంతో చిరు వద్దని చెప్పారట. దీంతో సెట్స్ మీదకు వెళ్లకు ముందే ఈ పాత్రకు కత్తెర పడిందట. అయితే ఈ విషయం తెలిసిన తరువాత చాలా మంది ఈ పాత్ర ఉంటే సినిమాకు మరింత బలం చేకూరేదనని అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ మూవీ క్లైమాక్స్ విషయంలోనూ మూవీ యూనిట్‌లో డైలమా నడిచింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ప్రకారం చివర్లో ఆయనకు బ్రిటీష్ వారు ఉరి తీస్తారు. అయితే దీన్ని ఫ్యాన్స్ ఎలా స్వీకరిస్తారని మూవీ యూనిట్ చాలా ఆలోచించిందట. కానీ చరిత్రను వక్రీకరించడం వలన మూవీపై నెగిటివ్ పడుతుందని భావించి, చివరకు ఉరి సన్నివేశాన్ని అందులో పెట్టినట్లు అప్పట్లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,384 కొత్త కేసులు.. 11 మరణాలు

వారిని బలిపశువులను చేశారు: హైకోర్టు