Gulshan Devaiah : అలాంటి సీన్స్ మీరే ఎంజాయ్ చేస్తారు.. మాకు మాత్రం చాలా బోరింగ్.. బీటౌన్ హీరో కామెంట్స్..

|

Jul 17, 2024 | 4:34 PM

ఇక నిన్న ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా గుల్షన్ దేవయ్య రెడిట్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి గుల్షన్ దేవయ్యను ప్రశ్నిస్తూ.. మొదట్లో సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఎలా అనిపించింది.. అలాగే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ? అంటూ ప్రశ్నించాడు. దీనిపై గుల్షన్ స్పందిస్తూ.. చాలా బోరింగ్ గా ఉంటుందని అన్నారు.

Gulshan Devaiah : అలాంటి సీన్స్ మీరే ఎంజాయ్ చేస్తారు.. మాకు మాత్రం చాలా బోరింగ్.. బీటౌన్ హీరో కామెంట్స్..
Gulshan Devaiah
Follow us on

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు గుల్షన్ దేవయ్య. ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ఉలఝ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఇందులో హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక నిన్న ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా గుల్షన్ దేవయ్య రెడిట్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి గుల్షన్ దేవయ్యను ప్రశ్నిస్తూ.. మొదట్లో సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఎలా అనిపించింది.. అలాగే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ? అంటూ ప్రశ్నించాడు. దీనిపై గుల్షన్ స్పందిస్తూ.. చాలా బోరింగ్ గా ఉంటుందని అన్నారు.

గుల్షన్ దేవయ్య స్పందిస్తూ.. “చాలా బోరింగ్ గా అనిపించేది.. ఇప్పుడు కూడా అలాగే బోరింగ్ అనిపిస్తుంది. కానీ అలాంటి సీన్స్ చూస్తూ మీరు మాత్రమే ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు. గతంలో హంటర్ లాంటి సినిమాల్లో గుల్షన్ రొమాంటిక్ సీన్స్ లో నటించాడు. అలాగే గతంలో ఓటీటీలో అఫ్సోస్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండో సీజన్ ఉంటుందా ? అని మరో అభిమాని అడగ్గా.. దాని గురించి మర్చిపోండి అంటూ సింపుల్ గా చెప్పేశాడు. మరో నటుడి సినిమా ఏదైనా మీరు చేసి ఉంటే బాగుండేదా అని అడగ్గా.. అందాధున్ అని అన్నారు. 2018లో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన అంధాదున్ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే నటించారు.

ప్రస్తుతం గుల్షన్ దేవయ్య, జాన్వీ కపూర్ నటించిన ఉలఝ్ మూవీ ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డ్ విజేత సుధాన్షు సరియా దర్శకత్వం వహించగా.. రోషన్ మాథ్యూ, రాజేష్ తైలాంగ్, ఆదిల్ హుస్సేన్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో గుల్షన్ అండర్ కవర్ ఏజెంట్ గా కనిపించనున్నారు. అలాగే జాన్వీ లండన్ లో ఇండియా డిప్యూటీ హై కమిషనర్ గా కనిపించనుంది.