Sushant Singh Rajput Drug Case: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నకొద్ది రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితుడు, సహాయ దర్శకుడు రిషికేష్ పవార్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. నిషేధిత డ్రగ్స్ వినియోగిస్తుండడమే కాకుండా వాటిని సేకరిస్తున్నట్లు పవార్పై ఆరోపణలున్నాయి. సుశాంత్ సింగ్కు కూడా అతడు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఇదే కేసులో విచారణకు హాజరైన సుశాంత్ మాజీ స్నేహితురాలు రియా చక్రవర్తి కూడా తన వాంగ్మూలంలో పవార్ పేరును వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్ ఇంట్లో పని చేసే దీపేష్ సావంత్ కూడా విచారణలో రిషికేష్ పేరును వెల్లడించినట్లు తెలుస్తోంది. దీపేష్ ఇచ్చిన సమాచారంతో ఎన్సీబీ అధికారులు రిషికేష్ ఇంటిపై దాడి చేసి ల్యాప్టాప్, హార్డ్ డిస్క్, డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్తో మంచి పరిచయం ఉన్న రిషికేష్ అతని డ్రీమ్ ప్రాజెక్టులో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు కాగా, రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా పలువురు డ్రగ్స్ వ్యాపారులను ఎన్సీబీ అరెస్టు చేసింది.ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటికే ఏమి తేల్చలేకపోయింది. దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది.
Also Read:
Adipurush Movie: ఆదిపురుష్ ఆరంభ్.. బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్కు పండగే..