Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Govt Michael Jackson: 24 ఏళ్ల తర్వాత మైఖేల్ జాక్సన్ కచేరీ కి పన్ను మినహాయింపు ఇస్తామంటున్న..

మైఖేల్ జాక్సన్ 24 ఏళ్ల క్రితం ముంబై‌లో నిర్వహించిన సంగీత కచేరీకి తాజాగా మహారాష్ట్రలోని శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడానికి సిద్ధమైంది...

Maharashtra Govt Michael Jackson: 24 ఏళ్ల తర్వాత మైఖేల్ జాక్సన్ కచేరీ కి పన్ను మినహాయింపు ఇస్తామంటున్న..
Follow us
Surya Kala

| Edited By: Team Veegam

Updated on: Jan 08, 2021 | 3:48 PM

Maharashtra Govt Michael Jackson: మైఖేల్ జాక్సన్ 24 ఏళ్ల క్రితం ముంబై‌లో నిర్వహించిన సంగీత కచేరీకి తాజాగా మహారాష్ట్రలోని శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడానికి సిద్ధమైంది. నిజానికి 1996లో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న శివసేన సర్కార్ కచేరీకి పన్ను మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంత మంది కోర్టు మెట్లు ఎక్కారు. బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ విషయాన్ని రిజర్వ్‌లో పెట్టింది. అయితే 24 సంవత్సరాల తరువాత, తిరిగి శివసేనఅధికారంలోకి రావడంతో, మాఫీని తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ విషయాన్నీ క్యాబినెట్ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుంటామని ప్రకటించింది.

ఒక వేళ పన్ను మినహాయింపు ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. కచేరీ యొక్క ఈవెంట్ మేనేజర్లు, విజ్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్, టికెట్ అమ్మకాలలో రూ .3.36 కోట్లను నిర్వాహకులు తిరిగి తీసుకోగలుగుతారు, వీటిని హైకోర్టు ఆదేశాల ప్రకారం కోర్టు ఖజానాలో జమ చేశారు. ఈ కచేరీ ఆనాటి అతిపెద్ద సంగీత కచేరీలలో ఒకటి. ఇది రాజ్ ఠాక్రే యొక్క మొట్టమొదటి పెద్ద బహిరంగ కార్యక్రమం. కచేరీని “క్లాసికల్ షో”గా అభివర్ణిస్తూ.. అప్పటి బాల్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం మైఖేల్ జాక్సన్ కు రెడ్ కార్పెట్ పరిచింది. ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థకు వినియోగిస్తారంటూ పన్ను మినహాయింపు ఇచ్చింది.

ఇదే విషయంపై అప్పట్లో శివసేన పై దివంగత నేత బాల్ థాకరే పై విమర్శలు వినిపించాయి. పాశ్చాత్య విలువలను సూచించే పాప్‌స్టార్ కచేరీని ఎలా నిర్వహించారంటూ ఎద్దేవా చేశారు. ఈ మాఫీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముంబై గ్రాహక్ పంచాయతీ కోర్టులో సవాలు చేసింది. ఎంటర్టైన్మెంట్ డ్యూటీ యాక్ట్ (1923) లోని నిబంధనల ప్రకారం పాప్ సంగీతం మాఫీకి అర్హత లేదని ముంబై గ్రాహక్ పంచాయతీ వాదించింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత, ఏప్రిల్ 13, 2011 న మినహాయింపుకు సంబంధించి ఉత్తర్వులను ముంబై హైకోర్టు డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. ఈ విషయాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి రిమాండ్ చేసింది.

Also Read: కరోనా వైరస్ కు టీకా వేయించుకున్న తొలి బాలీవుడ్ నటిగా నిలిచిన మహేష్ బాబు వదిన