AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూరీనో, ఇడ్లీనో.. మోక్షజ్ఙ ఎంట్రీపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..!

నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఙ టాలీవుడ్ ఎంట్రీ వార్త మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఎప్పుడైనా మోక్షజ్ఙ ఎంట్రీ ఉండొచ్చని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బాలయ్య. దీంతో మోక్షజ్ఞను ఎవరు ఇంట్రడ్యూస్‌ చేయబోతున్నారన్నది చర్చ ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్‌, అనిల్ రావిపూడి, సాయి మాధవ్ బుర్రా ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తన వారసుడి ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. ఓ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞను […]

పూరీనో, ఇడ్లీనో.. మోక్షజ్ఙ ఎంట్రీపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 09, 2020 | 1:00 PM

Share

నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఙ టాలీవుడ్ ఎంట్రీ వార్త మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఎప్పుడైనా మోక్షజ్ఙ ఎంట్రీ ఉండొచ్చని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బాలయ్య. దీంతో మోక్షజ్ఞను ఎవరు ఇంట్రడ్యూస్‌ చేయబోతున్నారన్నది చర్చ ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్‌, అనిల్ రావిపూడి, సాయి మాధవ్ బుర్రా ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తన వారసుడి ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ.

ఓ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞను పూరీ లాంచ్ చేయబోతున్నారా..? అన్న ప్రశ్నకు.. ఇడ్లీ, ఉప్మా పేర్లు కూడా చెప్పండి అంటూ కాస్త వ్యంగంగా సమాధానం ఇచ్చారు బాలయ్య. ఆ తరువాత మాట్లాడుతూ.. తన కుమారుడిని హీరోగా ఎలా లాంఛ్‌ చేయాలో తనకు తెలుసని అన్నారు. అంతేకాదు కొన్ని స్క్రిప్ట్‌లను కూడా ఓకే చేసినట్లు ఆయన వివరించారు. మరి మోక్షజ్ఞను ఎవరు లాంచ్‌ చేయబోతున్నారు..? నందమూరి ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు నెరవేరుతుంది..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: 75 సంవత్సరాలలో ఇదే తొలిసారి..!