Anil Kapoor : ఆడియెన్స్ థియేట‌ర్ల‌లో సినిమా చూసేందుకు చాలా ఆస‌క్తిగా ఉన్నారు : అనీల్ కపూర్

కరోనా కల్లోలంతో సినిమా ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలు అవుతుంది థియేటర్స్ లో బొమ్మ పడి.  థియేటర్స్ రీ ఓపెన్ కు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో..

Anil Kapoor : ఆడియెన్స్ థియేట‌ర్ల‌లో సినిమా చూసేందుకు చాలా ఆస‌క్తిగా ఉన్నారు : అనీల్ కపూర్
Follow us

|

Updated on: Jan 06, 2021 | 2:28 PM

Anil Kapoor : కరోనా కల్లోలంతో సినిమా ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలు అవుతుంది థియేటర్స్ లో బొమ్మ పడి.  థియేటర్స్ రీ ఓపెన్ కు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల థియేటర్స్ కు రావడం మొదలు పెట్టారు. ఈ విషయం పై తాజాగా బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. థియేటర‌ల్లో సినిమా ఫీల్ ను ఎంజాయ్ చేసేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌ని అన్నారు. అనీల్ కపూర్ నటించిన ‘ఏకే వ‌ర్సెస్ ఏకే ‘ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యాయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అనీల్ మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు బిగ్ స్క్రీన్ కోసం పుడతాయి అని అన్నారు. ప్ర‌జ‌లు నా సినిమాను ఆద‌రిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కొన్ని సినిమాలు మాత్ర‌మే బిగ్‌స్క్రీన్స్ కోసం త‌యార‌వుతాయి. నేను న‌టించిన కొన్ని సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. ప్రేక్ష‌కులు ఆ సినిమాలను థియేట‌ర్ల‌లో చూస్తార‌ని ఆశిస్తున్నా. ఎందుకంటే ఆడియెన్స్ థియేట‌ర్ల‌లో సినిమా చూసేందుకు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు అంటూ అనీల్ కపూర్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఇక్కడ చూడండి :

Ameesha Patel : హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. పోలీసులను ఆశ్రయించిన బ్యూటీ