AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ కోసం ఆ హీరోయిన్‌ను సెట్ చేయాలనుకుంటోన్న నాగ్ అశ్విన్..!

‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ప్రభాస్, మహానటితో ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ను నాగ్‌ చాలా బాగా రాశాడని ఆ మధ్యన అశ్వనీదత్ సైతం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా ఈ కాంబోలో మూవీపై అనౌన్స్ వచ్చిన రోజు నుంచే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అందరిలో […]

ప్రభాస్ కోసం ఆ హీరోయిన్‌ను సెట్ చేయాలనుకుంటోన్న నాగ్ అశ్విన్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 21, 2020 | 5:30 PM

Share

‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ప్రభాస్, మహానటితో ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ను నాగ్‌ చాలా బాగా రాశాడని ఆ మధ్యన అశ్వనీదత్ సైతం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా ఈ కాంబోలో మూవీపై అనౌన్స్ వచ్చిన రోజు నుంచే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అందరిలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన మరో వార్త టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ మూవీలో హీరోయిన్‌గా అలియా భట్‌ పేరు వినిపిస్తోంది. ఆ మధ్యన హీరోయిన్ పాత్ర కోసం దీపికాను అనుకుంటున్నట్లు వార్తలు రాగా.. తాజా సమచారం ప్రకారం ఆ పాత్రకు అలియా బాగా సెట్ అవుతుందని నాగ్‌ అశ్విన్ భావిస్తున్నారట. ఈ క్రమంలో త్వరలో ఆమెను కలిసి స్టోరీని వినిపించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇందులో నటించేందుకు ఆమె ఒప్పుకుంటే ఈ ప్రాజెక్ట్‌కు అలియా మరో అదనపు ఆకర్షణగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. కాగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ ద్వారా అలియా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఇందులో రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. ఆయన సరసన అలియా నటిస్తోంది. ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ల మధ్య నిలబడగలిగే సీత పాత్రకు ఆమే న్యాయం చేయగలదని భావించే, ఈ సినిమా కోసం అలియాను తాను ఎంపిక చేసుకున్నట్లు రాజమౌళి తెలిపారు.

Read This Story Also: ఆ వేంకటేశ్వరుని దయ వలన.. పుకార్లపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ ఛైర్మన్..!