AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himachal Pradesh Election Results 2022: హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ విజయానికి గండికొట్టి ఆ ఆరుగురు మంత్రులు.. ఏం జరిగిదంటే..

హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. అయితే, కాంగ్రెస్ అభ్యర్థుల కంటే చాలా వెనుకబడిన బీజేపీ మంత్రులు 6 మంది ఉన్నారు. వీరి ఓటమి బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలనే ఆశలపై నీళ్లు చల్లింది.

Himachal Pradesh Election Results 2022: హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ విజయానికి గండికొట్టి ఆ ఆరుగురు మంత్రులు.. ఏం జరిగిదంటే..
Himachal Pradesh Election Results
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 08, 2022 | 2:01 PM

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, ఓటముల మార్జిన్ అంతగా లేకపోయినా, ఇప్పటికీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినా కనీసం తమ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌ను బీజేపీ ఐదేళ్లపాటు పాలించింది. అయితే చివరి పరీక్ష అంటే ఎన్నికల విషయానికి వచ్చేసరికి, తమ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కంటే వెనుకంజలో ఉన్న 6 మంది మంత్రులు ఉన్నారు.

ఏ మంత్రులు వెనుకంజలో ఉన్నారంటే?

1- హిమాచల్ ప్రదేశ్ సాంకేతిక విద్యా మంత్రి రామ్ లాల్ మకరంద్ లాహౌల్-స్పితి నుంచి పోటీ చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయనకు కేవలం 8,058 ఓట్లు రాగా, ఆయనపై కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రవి ఠాకూర్ 9,734 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

2- హిమాచల్ ప్రదేశ్ విద్యా మంత్రి గోవింద్ సింగ్ ఠాకూర్ కూడా తన స్థానం నుండి వెనుకబడి ఉన్నారు. మనాలి స్థానం నుంచి గోవింద్‌ బరిలో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు గోవింద్‌కు 20798 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు చెందిన వినోద్ సుల్తాన్‌పురికి 18,883 ఓట్లు వచ్చాయి.

3- హిమాచల్ ప్రదేశ్‌లో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన రాజీవ్ సైజల్ వెనుకంజలో ఉన్నారు. రాజీవ్ కసౌలి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు 13,656 ఓట్లు మాత్రమే రాగా, ఆయన ముందు పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి ఆయన కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

4- హిమాచల్ సామాజిక న్యాయ శాఖ మంత్రి సర్వేన్ చౌదరి వెనుకబడి ఉండగా, ఆమె ముందు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చాలా ముందున్నారు. షాపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సర్వీన్ చౌదరి మధ్యాహ్నం 1 గంట వరకు 23931 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కేవల్ సింగ్‌కు 35,862 ఓట్లు వచ్చాయి.

5- హిమాచల్ ప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ మంత్రిగా పనిచేసిన మంత్రి వీరేంద్ర కన్వర్ తన ప్రత్యర్థి కంటే వెనుకబడి ఉన్నారు. వీరేంద్ర కన్వర్‌కి 24,402 ఓట్లు రాగా, కుట్లేహర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి దేవిందర్‌ కుమార్‌కు 30,668 ఓట్లు వచ్చాయి.

6- ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాజిందర్ గార్గ్ కూడా తన సీటు వెనుక ఉన్నారు. ఘుమర్విన్ స్థానం నుంచి పోటీ చేసిన రాజిందర్ గార్గ్‌కు మధ్యాహ్నం 1 గంట వరకు 20157 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు చెందిన రాజేష్ ధర్మాణికి 24,003 ఓట్లు వచ్చాయి.

ఇంతకీ పరిస్థితి ఏమిటి

మధ్యాహ్నం 2 గంట వరకు కౌంటింగ్ ముగిసిన తరువాత, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బిజెపి 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 68 స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 35 సీట్లు అవసరం.

మరిన్ని జాతీయ వార్తల కోసం

విమర్శలకు పంత్ స్ట్రాంగ్ రిప్లే..
విమర్శలకు పంత్ స్ట్రాంగ్ రిప్లే..
వేసవిలో ముఖం ప్రకాశవంతంగా ఉండాలంటే..పచ్చి పాలను ఈ విధంగా వాడండి
వేసవిలో ముఖం ప్రకాశవంతంగా ఉండాలంటే..పచ్చి పాలను ఈ విధంగా వాడండి
చుక్క నెత్తురు చిందించకుండానే పాక్‌ ఉక్కిరిబిక్కిరి!
చుక్క నెత్తురు చిందించకుండానే పాక్‌ ఉక్కిరిబిక్కిరి!
రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన RRB..!
రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన RRB..!
థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు,
థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు,
ప్రత్యర్థులను కవ్వించే విరాట్ ఇలా ఎందుకు మారాడో తెలుసా?
ప్రత్యర్థులను కవ్వించే విరాట్ ఇలా ఎందుకు మారాడో తెలుసా?
ఈ ఏడాది రెండో చంద్ర,సూర్య గ్రహణాలు ఎప్పుడు? సూత సమయం తెలుసుకోండి
ఈ ఏడాది రెండో చంద్ర,సూర్య గ్రహణాలు ఎప్పుడు? సూత సమయం తెలుసుకోండి
వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌
వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌
వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!
వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!
పదో తరగతి 2025 మెమోలపై..మార్కులతోపాటు పాస్, ఫెయిల్‌ ముద్రణ!
పదో తరగతి 2025 మెమోలపై..మార్కులతోపాటు పాస్, ఫెయిల్‌ ముద్రణ!