AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Assembly Elections: గోవాలో పాగా కోసం టీఎంసీ ఎత్తులు.. రెండు రోజు పర్యటనకు బెంగాల్ సీఎం మమతా

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గోవాలో పర్యటిస్తున్నారు. దీదీ ఆ రాష్ట్రంలో రెండో పర్యటన. ఆమెతో పాటు అఖిల భారత ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా ఈసారి పర్యటనలో పాల్గొంటున్నారు.

Goa Assembly Elections: గోవాలో పాగా కోసం టీఎంసీ ఎత్తులు.. రెండు రోజు పర్యటనకు బెంగాల్ సీఎం మమతా
Mamata Banerjee
Balaraju Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 23, 2021 | 6:28 PM

Share

Bengal CM Mamata banerjee Goa Tour: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గోవాలో పర్యటిస్తున్నారు. దీదీ ఆ రాష్ట్రంలో రెండో పర్యటన. ఆమెతో పాటు అఖిల భారత ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా ఈసారి పర్యటనలో పాల్గొంటున్నారు. గోవా పర్యటన సందర్భంగా మమతా బెనర్జీ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో సమావేశమై గోవా ఇంటర్నేషనల్ సెంటర్‌లో గోవా టీఎంసీ నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల వ్యూహాన్ని రచించనున్నారు. గోవా పర్యటనలో మమతా బెనర్జీ మూడు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో ఒక సభ దక్షిణ గోవాలో జరగనుండగా, రెండు సమావేశాలు ఉత్తర గోవాలో జరగనున్నాయి. ఫిబ్రవరిలో జరగనున్న గోవా ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేయనున్నట్టు ప్రకటించింది.

TMC విడుదల చేసిన ఒక ప్రకటనలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ 13, 14 డిసెంబర్ 2021 తేదీలలో గోవాలో వివిధ కార్యక్రమాలకు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఆమె పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు బహిరంగ సభల్లో కూడా ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం మమతా బెనర్జీ ఆదివారం సాయంత్రం గోవా చేరుకున్నారు. ఈ పర్యటనలో అతనితో పాటు అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు.

గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ ఐదు వాగ్దానాలను ప్లాన్ చేసింది, ఆ పార్టీ ఇప్పటివరకు మూడు వాగ్దానాలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని శనివారం తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ పథకం కింద గోవా మహిళలు నెలకు రూ. 5,000 అందిస్తామన్నారు. తృణమూల్ వాగ్దానం ప్రకారం 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలోని మహిళలకు డబ్బులు ఇచ్చేలా తృణమూల్ ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు టిఎంసిపై విరుచుకుపడగా, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం టిఎంసిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఆదివారం నాడు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గోవాలో టీఎంసీ, ఆప్ మధ్య ఎలాంటి ఒప్పందం ఉండబోదని స్పష్టం చేశారు. గోవా ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు. TMCతో ఎలాంటి ఒప్పందమూ ఉండదు. మరోవైపు ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిస అవసరం ఉందని టీఎంసీ పిలుపునిచ్చింది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో టీఎంసీ పొత్తు పెట్టుకుంది.

మమతా బెనర్జీ పూర్తి కార్యక్రమం

తేదీ: డిసెంబర్ 13, 2021

1:00 PM: గోవాలోని ఇంటర్నేషనల్ సెంటర్‌లో మీడియా గ్రూప్ ఎడిటర్‌లతో సమావేశం 2:00 PM: గోవాలోని ఇంటర్నేషనల్ సెంటర్‌లో గోవా TMC నాయకులందరితో సమావేశం మధ్యాహ్నం 3:30: బెనౌలింలో బహిరంగ సభ

తేదీ: డిసెంబర్ 14, 2021

3:00 PM: పనాజీలో బహిరంగ సభ 5:00 PM: అసనోరాలో బహిరంగ సభ

Read Also…  PM Modi: ఏ దేశమైనా సమస్యలను సకాలంలో పరిష్కరిస్తేనే అవి తీవ్రంకాకుండా చేయగలదు.. ప్రధాని మోడీ