AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండచరియలు విరిగిపడి మహిళా క్రికెటర్ దుర్మరణం

భారీ వర్షాలు మేఘాలయ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా కొండచరియలు విరిగిపడతున్నాయి. తాజాగా మేఘాలయ తూర్పు ఖాసీ హిల్స్‌ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడగా ఓ మహిళా క్రికెటర్‌ మృతి చెందింది.

కొండచరియలు విరిగిపడి మహిళా క్రికెటర్ దుర్మరణం
Balaraju Goud
|

Updated on: Sep 25, 2020 | 7:29 PM

Share

భారీ వర్షాలు మేఘాలయ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా కొండచరియలు విరిగిపడతున్నాయి. తాజాగా మేఘాలయ తూర్పు ఖాసీ హిల్స్‌ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడగా ఓ మహిళా క్రికెటర్‌ మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఐదుగురి ఆచూకీ గల్లంతైందని అధికారులు తెలిపారు. మావ్నీ ప్రాంతంలో ఉదయం 6 గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. కొండచరియలు విరిగిపడడంతో జాతీయ టోర్నమెంట్లలో మేఘాలయ తరఫున ప్రాతినిథ్యం వహించిన మహిళా క్రికెటర్ రజియా అహ్మద్ మృతదేహాన్ని శిథిలాల వెలికితీసినట్లు మావ్నీ ప్రాంతీయ అధిపతి బాహ్ బడ్ పేర్కొన్నారు. 2011-12 నుంచి మధ్య కాలం మేఘాలయ రాష్ట్రం తరుపున మహిళా క్రికెటర్ రజియా అహ్మద్ వివిధ టోర్నమెంట్లలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిందని మేఘాలయ క్రికెట్ పేర్కొంది. రజియా అహ్మద్ మృతి పట్ల ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తోపాటు సహచరులు, క్రీడా ప్రముఖలు సంతాపం తెలిపారు. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది.