AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో మరో నిర్భయ ఘటన.. కదులుతున్న బస్సులో అత్యాచారం..

దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎలాంటి శిక్షలు విధించినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తొమ్మిదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో అర్థరాత్రి కదులుతున్న బస్సులో నిర్భయపై జరిగిన అత్యాచారం తర్వాత చట్టాలు పటిష్టం చేసినా...

యూపీలో మరో నిర్భయ ఘటన.. కదులుతున్న బస్సులో అత్యాచారం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 18, 2020 | 11:46 AM

Share

దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎలాంటి శిక్షలు విధించినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తొమ్మిదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో అర్థరాత్రి కదులుతున్న బస్సులో నిర్భయపై జరిగిన అత్యాచారం తర్వాత చట్టాలు పటిష్టం చేసినా కూడా లాభం లేకుండా పోయింది. అలాంటి ఘటన తలపించేలా బుధవారం యూపీలో మరో దారుణం జరిగింది. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. ఇద్దరు బస్సు డ్రైవర్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.

ప్రతాప్‌గఢ్ నుంచి నోయిడాకు వెళ్తున్న ఓ ప్రైవేటు ఏసీ స్లీపర్ బస్సు 25 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకుని బస్సు ఎక్కింది. ఈ క్రమంలో మహిళపై కన్నేసిన బస్సు డ్రైవర్లు వెనుక చివరి సీట్లో కూర్చోమన్నారు. అనంతరం పిల్లలను చంపుతామని బెదిరించి కదులుతున్న బస్సులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బస్సు దిగిన వెంటనే ఆమె భర్త సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 36, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దారుణానికి పాల్పడ్డ నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు.

Follow Us