AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: రూ.300 ఇవ్వలేదని లారీతో తొక్కించి చంపాడు.. పల్నాడు జిల్లాలో దారుణం

ప్రస్తుత సమాజంతో మానవ సంబంధాల కంటే మనీ సంబంధాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా.. చిత్తు కాగితాలు ఏరుకునే ఓ మహిళ పట్ల లారీ డ్రైవర్ కర్కశంగా ప్రవర్తించాడు. పిల్లలతో కలిసి లారీ ఎక్కిన మహిళ పట్ల క్రూరంగా....

Guntur: రూ.300 ఇవ్వలేదని లారీతో తొక్కించి చంపాడు.. పల్నాడు జిల్లాలో దారుణం
Ganesh Mudavath
|

Updated on: May 20, 2022 | 12:21 PM

Share

ప్రస్తుత సమాజంతో మానవ సంబంధాల కంటే మనీ సంబంధాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా.. చిత్తు కాగితాలు ఏరుకునే ఓ మహిళ పట్ల లారీ డ్రైవర్ కర్కశంగా ప్రవర్తించాడు. పిల్లలతో కలిసి లారీ ఎక్కిన మహిళ పట్ల క్రూరంగా వ్యవహరించి ఆమె మృతికి కారణమయ్యాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కారణంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పల్నాడు(Palnadu) జిల్లాలోని చిలకలూరిపేటకు(Chilakaluripet) చెందిన మహిళ చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవిస్తోంది. ఉపాధి కోసం తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని చిలకలూరిపేట నుంచి గుంటూరుకు వెళ్లేందుకు లారీ ఎక్కింది. గుంటూరు(Guntur)లోని నాయుడుపేట జిందాల్‌ కంపెనీ సమీపంలోకి చేరుకోగానే మహిళ తన పిల్లలతో కలిసి లారీ దిగింది. లారీ డ్రైవర్ కు వంద రూపాయలు ఇవ్వగా అతడు నిరాకరించాడు. ఇంకా రెండు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బుల్లేవని ఆ మహిళ ఎంత చెప్పినా డ్రైవర్ వినిపించుకోలేదు.

మహిళ కుమార్తె చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ని లాక్కున్నాడు. ఆమె సెల్ ఫోన్ కోసం లారీ ఎక్కగానే డ్రైవర్‌ బండి స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. అది చూసి కంగారు పడిన మహిళ.. కూతురు కోసం లారీని పట్టుకుని వేలాడుతూ కొంత దూరం అలానే వెళ్లింది. తర్వాత అదుపుతప్పి లారీ కింద పడి మృతి చెందింది. మహిళ మృతి చెందడం చూసిన డ్రైవర్‌ లారీ ఆపి అందులోని పాపను కిందికి దించి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. లారీ కింద పడి మృతి చెందిన తల్లి మృతదేహంపై పడి పిల్లలు రోదిస్తున్న తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Ratlam Temple: ఆ ఆలయానికి వెళ్తే.. వెండి, బంగారం నాణేలు ప్రసాదంగా ఇస్తారు.. మన దేశంలోనే

Mahesh Babu: మహేశ్‌, త్రివిక్రమ్‌ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌.. క్యామియో రోల్‌లో కనిపించనున్న ఆ స్టార్‌ హీరో!

భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి