నా కూతుళ్ళను ఆ దుర్మార్గులు వేధిస్తున్నారు.. కువైట్ నుంచి ఓ తల్లి ఆవేదన
తన ఇద్దరి కూతుళ్ళను ఇద్దరు యువకులు వేధిస్తున్నారంటూ.. ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాను కువైట్కి ఉపాధి కోసం వెళ్తే... నా ఇద్దరి కూతుళ్లపై పెట్రోల్ పోసి తగలబెడతానంటూ.. యువకులు బెదిరిస్తున్నారని.. వారిని కాపాడలంటూ...
తన ఇద్దరి కూతుళ్ళను ఇద్దరు యువకులు వేధిస్తున్నారంటూ.. ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తాను కువైట్కి ఉపాధి కోసం వెళ్తే… నా ఇద్దరి కూతుళ్లపై పెట్రోల్ పోసి తగలబెడతానంటూ.. యువకులు బెదిరిస్తున్నారని.. వారిని కాపాడలంటూ.. టీవీ9కు సెల్ఫీ వీడియో పంపింది మహిళ.
ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని అరుంధతి నగర్లో జరిగింది. ప్రేమించాలంటూ ఇద్దరు యువకులు.. గత కొంతకాలంగా యువతుల వెంట పడుతున్నారు. అయితే యువకుల వేధింపులు మరీ ఎక్కువైనందుకు ఆ అక్కాచెల్లెల్లు అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కాగా కేసు పెట్టిన కొన్ని గంటల్లోనే ఇద్దరి యువకులను పోలీసులు వదిలేశారు. కేసు పెట్టినందుకు యువతులపై పెట్రోల్ పోసి చంపేస్తానంటూ ఆ యువకులు బెదిరించారు. దిక్కు తోచని స్థితిలో ఇద్దరు యువతులు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. అయితే పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని.. తమ కూతుళ్లను ఎలాగైనా కాపాడాలంటూ.. టీవీ9కి సెల్ఫీ వీడియో పంపింది తల్లి.
Read More:
హోమ్ క్వారంటైన్లో జబర్దస్త్ నటుడు
మళ్లీ తెరపైకి ‘ప్రత్యేక హోదా’ అంశం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
వరంగల్ మర్డర్ మిస్టరీలో బయటపడ్డ మరో కొత్త కోణం.. 10 కూడా కాదు..