AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి..పలువురికి గాయాలు

ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాకారంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటన

ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి..పలువురికి గాయాలు
Jyothi Gadda
|

Updated on: Jun 22, 2020 | 6:46 PM

Share

ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాకారంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజ్‌ఘడ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నట్లుగా తెలుస్తోంది.

రాజ్‌ఘడ్ జిల్లా సారంగపూర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొనడంతో ఒక కారులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా..మరో చిన్నారికి గాయాలయ్యాయి. వీరు ఇండోర్ నుంచి గునాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారులో మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌లోని లఖ్నవూకి ఐదుగురు సాధువులు వెళ్తున్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.