AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Attack: అటవీశాఖ సిబ్బందిపై తిరగబడ్డ పోడు రైతులు.. మహిళా రేంజ్ అధికారిణిపై పెట్రోల్ దాడి..!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. అటవీ శాఖ అధికారిణిపై పెట్రోల్ దాడికి యత్నించారు ఆదివాసీలు. మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులపై గిరిజనులు పెట్రోల్‌తో దాడి చేశారు.

Petrol Attack: అటవీశాఖ సిబ్బందిపై తిరగబడ్డ పోడు రైతులు.. మహిళా రేంజ్ అధికారిణిపై పెట్రోల్ దాడి..!
Tribal Farmers Petrol Attack
Balaraju Goud
|

Updated on: Sep 16, 2021 | 6:47 PM

Share

Tribal Farmers Petrol Attack: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. అటవీ శాఖ అధికారిణిపై పెట్రోల్ దాడికి యత్నించారు ఆదివాసీలు. మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులపై గిరిజనులు పెట్రోల్‌తో దాడి చేశారు. భూపాలపల్లి మండలం ఆజాంనగర్ పరిదిలోని పందిపంపుల గ్రామ శివారులో ఈ ఘటనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోడుభూమిలో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటుతుండగా.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆదివాసీలు అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీ రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ నెలకొంది.

ఈ క్రమంలోనే ఆదివాసీ రైతులు అటవీ అధికారిణిపై సెట్రోల్ పోసి నిప్పటించేందుకు ప్రయత్నించారు. పోడు భూముల్లో ప్లాంటేషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ భాదితురాలిని భూపాలపల్లి PHCకి తరలించారు అధికారులు. కాగా, ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also..  TSRTC Bus: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన నిర్ణయం.. ఇకపై బస్సుల్లో అలాంటి పోస్టర్లపై నిషేధం

Cat Viral Video: ‘కాపీ క్యాట్’ అన్న పదానికి ఈ పిల్లి సరిగ్గా సరిపోతుంది.. మార్జాలం చేసిన పని చూస్తే..