హైదరాబాద్లో మైనర్ బాలికపై అత్యాచారం.. సుమోటాగా స్వీకరణ..!
హైదరాబాద్లో చాదర్ ఘట్ పోలీసు స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలికపై ముస్లిం సామాజిక వర్గానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే.
హైదరాబాద్లో చాదర్ ఘట్ పోలీసు స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలికపై ముస్లిం సామాజిక వర్గానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ సుమోటాగా స్వీకరించారు. అత్యాచార ఘటనపై వెంటనే స్థానిక పోలీసులు కేసు విచారణను చేపట్టి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని పేర్కొన్నారు. ఇక రెవిన్యూ అధికారులతో మాట్లాడి బాధితురాలికి అట్రాసిటీ కేసుకు సంబంధించిన ఎక్స్ గ్రేషియాను అందజేయాలని సూచించారు.
బాధితురాలికి న్యాయం జరిగే వరకు అన్ని విధాలుగా అండగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ..” చాదర్ ఘట్ లోని సంఘటనను సుమోటాగా స్వీకరించాం. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించాం. బాధితురాలికి ఎక్స్ గ్రేషియా అందించాలి. అన్ని విధాలుగా అండగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించాం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు కమిషన్ అన్ని విధాలుగా అండగా ఉంటుంది” అని తెలిపారు.
Read This Story Also: కరోనా అప్డేట్స్.. తెలంగాణలో మొత్తం కేసులు ఎన్నంటే..!