AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రియల్టర్ కిడ్నాప్.. సినిమా స్టైల్లో దుండగులను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు

సినీఫక్కీలో ఓ రియల్టర్‌ కిడ్నాప్‌ జరిగింది. ఈ ఉదయాన్నే నిర్మల్‌జిల్లా కేంద్రంలోని దివ్యనగర్‌ తన్వి అపార్ట్‌మెంట్‌లో...

Telangana: రియల్టర్ కిడ్నాప్.. సినిమా స్టైల్లో దుండగులను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
Kidnap
Ram Naramaneni
|

Updated on: Aug 08, 2021 | 11:10 AM

Share

సినీఫక్కీలో ఓ రియల్టర్‌ కిడ్నాప్‌ జరిగింది. ఈ ఉదయాన్నే నిర్మల్‌జిల్లా కేంద్రంలోని దివ్యనగర్‌ తన్వి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న రియల్టర్‌ విజయ్‌ దేశ్‌పాండేను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. కొందరు వ్యక్తులు విజయ్‌దేశ్‌పాండేను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు సిసిటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. లిఫ్టులోంచి బయటకు వస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కిడ్నాపైన విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పారు విజయ్‌దేశ్‌పాండే కుటుంబసభ్యులు. అలెర్టయిన పోలీసులు రెండు వాహనాలు తూఫ్రాన్‌ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే రెండు బృందాలు వెంబడించి కిడ్నాపర్లను తూఫ్రాన్‌ దగ్గర పట్టుకున్నారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. రియల్టర్‌ విజయ్‌ దేశ్‌పాండే క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. రియల్టర్‌ లావాదేవీలు, భూముల కొనుగోలు వ్యవహారమే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రియల్టర్‌ విజయ్‌ దేశ్‌పాండే సంగారెడ్డిలో రెండు నెలల క్రితం 2 కోట్ల విలువ చేసే భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి లావాదేవీల విషయంలో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్థానికంగా ఈ కిడ్నాప్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read: ఉదయం థియేటర్లలో రిలీజ్.. మ్యాట్నీకే ‘SR కళ్యాణమండపం’ పైరసీ రెడీ..

ఎరక్కపోయి వెళ్లాడు.. ఏటీఎంలో ఇరుక్కుపోయాడు.. ఈ సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు