ఆస్తి కోసం అన్నదమ్ముల ఘర్షణ..ఒకరు మృతి
అన్నదమ్ముల మధ్య తలెత్తిన పొలం వివాదం ఒకరి ప్రాణం తీసింది. తోబుట్టువు అని కూడా చూడకుండా ఇద్దరు వ్యక్తులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి...
అన్నదమ్ముల మధ్య తలెత్తిన పొలం వివాదం ఒకరి ప్రాణం తీసింది. తోబుట్టువు అని కూడా చూడకుండా ఇద్దరు వ్యక్తులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కృష్ణా జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నం మాజీ సర్పంచ్, అతడి సోదరుడికి మధ్య గత కొంతకాలంగా పొలం విషయంలో వివాదం కొనసాగుతోంది. వారికి గ 70 సెంట్ల పొలం పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. ఇటీవలే ఈ వివాదం మరింత ముదిరి ఒకరినొకరు పరస్పరం దూషించున్నారు. ఈ ఘర్షణలో అన్నాదమ్ములిద్దరూ కర్రలతో దాడి చేసుకున్నారు. దాడిలో మాజీ సర్పంచ్కు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే అతడు మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.