AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో ‘హానీ ట్రాప్’.. రాజస్తాన్ లో ఇద్దరి అరెస్ట్ !

ఇండియాలో పాకిస్తానీ గూఢచార నెట్ వర్క్ పై ఉక్కుపాదం మోపిన మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు, రాజస్థాన్ పోలీసులు తమ రాష్ట్రంలో ఇద్దరు సివిల్ డిఫెన్స్ ఉద్యోగులను..

మరో 'హానీ ట్రాప్'.. రాజస్తాన్ లో ఇద్దరి అరెస్ట్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 08, 2020 | 6:32 PM

Share

ఇండియాలో పాకిస్తానీ గూఢచార నెట్ వర్క్ పై ఉక్కుపాదం మోపిన మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు, రాజస్థాన్ పోలీసులు తమ రాష్ట్రంలో ఇద్దరు సివిల్ డిఫెన్స్ ఉద్యోగులను అరెస్టు చేశారు. వీరిద్దరూ కీలకమైన భారత ఆర్మీ స్థావరాల గురించిన సమాచారాన్ని పాక్ ఐఎస్ఐ కి చేరవేస్తున్నారట.. ‘ఆపరేషన్ డెజర్ట్’ లో భాగంగా పోలీసులు, సైనికవర్గాలు చేపట్టిన దర్యాప్తులో వీరు పట్టుబడ్డారు. ముల్తాన్ లోని పాకిస్తానీ మహిళా ఐఎస్ఐ సభ్యురాలొకరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని, ఆమెను ఈ ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరికి ‘ఎర’ గా వేశారని తెలిసింది. ఆమె ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ తెరచి.. తనను ఇండియాకు చెందిన ‘అనుష్క చోప్రా’ గా చెప్పుకుందని తెలిసింది.

ఈ కేసులో వికాస్ కుమార్, చిమన్ లాల్ అనే ఉద్యోగులను అరెస్టు చేశారు. వికాస్ సివిల్ డిఫెన్స్ ఆయుధ విభాగంలో పని చేస్తుండగా.. చిమన్ లాల్.. సైనిక్ మహాజన్ ఫీల్డింగ్ ఫైరింగ్ రేంజిలో సివిల్ కాంట్రాక్ట్ ఉద్యోగి అట.. వీరు డబ్బు కోసం పాకిస్తాన్ ఐఎస్ఐ కి గూఢచారులుగా పని చేస్తున్నట్టు వెల్లడైంది. వికాస్ కుమార్ ని ఇంటరాగేట్ చేయగా.. తన ఫేస్ బుక్ స్నేహితురాలు ఇండియన్ వాట్సాప్ నెంబర్ ని వినియోగించేదని, ముంబైలోని ఓ క్యాంటీన్ లో పని చేస్తున్నానని చెప్పుకునేదని తెలిపాడట. పాక్ నుంచి తనకు   75 వేల రూపాయలు ముట్టాయని, ఈ సొమ్ములో 9 వేలు చిమన్ లాల్ కి ఇచ్చానని వికాస్ చెప్పినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇతగాడు ఈ నెల మొదటివారం వరకు తరచూ పాక్ ఐఎస్ఐ కి సమాచారం పంపుతూ వచ్చా డని తెలిసింది.