AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లాయర్ ప్రాణాలు తీసిన భూ సమస్యలు.. కారులో వెంబడించి.. కత్తులతో దారుణంగా పొడిచి

భూ సమస్యలు, మట్టి మాఫియా ఓ లాయర్ ప్రాణాలు తీశారు. ఆయన కదలికలపై కాపు కాచిన దుండగులు దారుణంగా హత్య చేశారు. కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టి.. కారు నుంచి కింద పడేసి, పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు. హనుమకొండకు చెందిన....

Telangana: లాయర్ ప్రాణాలు తీసిన భూ సమస్యలు.. కారులో వెంబడించి.. కత్తులతో దారుణంగా పొడిచి
Lawyer Murder In Warangal
Ganesh Mudavath
|

Updated on: Aug 02, 2022 | 8:42 AM

Share

భూ సమస్యలు, మట్టి మాఫియా ఓ లాయర్ ప్రాణాలు తీశారు. ఆయన కదలికలపై కాపు కాచిన దుండగులు దారుణంగా హత్య చేశారు. కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టి.. కారు నుంచి కింద పడేసి, పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు. హనుమకొండకు చెందిన లాయర్ మూలగుండ్ల మల్లారెడ్డి.. సోమవారం ములుగు (Mulugu) జిల్లా కలెక్టరేట్ కు వచ్చారు. భూ సమస్యలపై అధికారులతో సంప్రదించి అదే రోజు సాయంత్రం 6.30కు హనుమకొండకు (Hanamkonda) తిరుగుపయనమయ్యారు. ఇదే సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనను అడ్డగించి దారుణంగా హత్య చేశారు. ములుగు మండలంలోని పందికుంట బస్‌ స్టేజీ సమీపంలో మల్లారెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. మల్లారెడ్డి కారు దిగి.. ఎందుకు ఢీ కొట్టారని వారిని ప్రశ్నించారు. వారు సంజాయిషీ ఇచ్చి, క్షమించాలని కోరడంతో మల్లారెడ్డి తన కారు ఎక్కాడు. అదే సమయంలో మరో నలుగురు వచ్చి.. మల్లారెడ్డిని వారిలో నుంచి కిందికి లాగారు. సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. మల్లారెడ్డి కారు డ్రైవర్ ను బెదిరించే కదలకుండా ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నారు.

హత్య చేసిన తర్వాత నిందితులందరూ అదే కారులో ఉడాయించారు. సమాచారం తెలుసుకున్న ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి పాటిల్‌.. పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మర్డర్ ఇన్సిడెంట్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. హత్యపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు ములుగు ఎస్సై ఓంకార్‌ యాదవ్‌ వెల్లడించారు.

కాగా.. లాయర్ మల్లారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ గ్రామానికి చెందిన ఆయన హనుమకొండలో స్థిరపడ్డారు. భూసమస్యల విషయమై మల్లారెడ్డి ములుగు కలెక్టర్‌, తహసీల్దారు ఆఫీస్ లకు వెళ్తున్నారు. ఆయనకు ములుగు మండలం మల్లంపల్లిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. అంతే కాకుండా ఎర్రమట్టి క్వారీ, పెట్రోలు బంకు ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఉద్దేశ్యపూర్వకంగానే ఆయనను హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం