AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రొమాన్స్ చేద్దామంటూ పిలిచింది.. అదును చూసి మర్మాంగాన్ని కోసేసింది.. ఇంతకీ ఏం జరిగందంటే..

బిహార్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. శృంగారానికి రెచ్చగొట్టి చివరికి ఆ వ్యక్తి మర్మంగాన్ని కోసేసింది ఓ మహిళ. ఈ దారుణ ఘటనకు...

రొమాన్స్ చేద్దామంటూ పిలిచింది.. అదును చూసి మర్మాంగాన్ని కోసేసింది.. ఇంతకీ ఏం జరిగందంటే..
Shiva Prajapati
|

Updated on: May 25, 2021 | 9:43 PM

Share

బిహార్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. శృంగారానికి రెచ్చగొట్టి చివరికి ఆ వ్యక్తి మర్మంగాన్ని కోసేసింది ఓ మహిళ. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌లోని ముజఫర్ నగర్ జిల్లా సాహెబ్‌గంజ్‌ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(32) తన భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. అయితే, సదరు మహిళ వేరే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో మహిళ తన ప్రియుడితో పొలంలో ఏకాంతంగా ఉండగా.. మరో వ్యక్తి వారిద్దరినీ చూశాడు. దాంతో ఆగ్రహించిన మహిళ.. తన మనసులోనే భారీ కుట్రకు ప్లాన్ వేసింది. తన పరువు పోకుండా ఉండేందుకై.. అతని మగతనాన్ని బలి తీసుకుంది. తనను నగ్నంగా చూసిన వ్యక్తిని సదరు మహిళ తన ముగ్గులోకి దింపింది.

శృంగారం కోసమంటూ పిలిచి.. గడ్డి కోసే కొడవలితో అతని మర్మాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో పరుగులు తీసిన బాధిత వ్యక్తిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, బాధితుడి కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే, తనపై అత్యాచారం చేయబోయాడని, ఆత్మరక్షణ చర్యలో భాగంగా అతని మర్మాంగాన్ని కోశానని ఆ మహిళ పోలీసులకు రివర్స్ ఫిర్యాదు చేసింది. ఇద్దరి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజమేంటో నిగ్గు తేల్చేందుకు కృషి చేస్తున్నారు.

Also read:

Telangana Corona Cases Updates: తెలంగాణలో 3,821 పాజిటివ్ కేసులు నమోదు.. 23 మంది మృ

Anandayya : ఆనందయ్యను నిర్బంధంలో ఉంచి ఎమ్మెల్యే కరోనా మందు చేయించుకుంటుంటే ఏం చేస్తున్నారు.? : సోమిరెడ్డితి..