AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Five Committed Suicide: విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

Five Committed Suicide: దేశంలో ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతోంది. కుటుంబ కలహాల వల్లనే, ఆర్థిక ఇబ్బందుల వల్లనే లేక ఇతర కారణాల వల్ల ఎంతోమంది తమ నిండు ప్రాణాలు..

Five Committed Suicide: విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
Subhash Goud
|

Updated on: Jul 02, 2022 | 11:25 AM

Share

Five Committed Suicide: దేశంలో ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతోంది. కుటుంబ కలహాల వల్లనే, ఆర్థిక ఇబ్బందుల వల్లనే లేక ఇతర కారణాల వల్ల ఎంతోమంది తమ నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కేరళలోని తిరువనంతపురం జిల్లా కళ్లంబలంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడటంతో కలకలం రేపుతోంది. హోటల్‌ వ్యాపారి మణికుట్టన్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, కుటుంబ సభ్యులు విషయం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా, ఐదుగురి శవాలు కనిపించాయి. దీంతో వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్యహత్యకు పాల్పడంతో స్తానికంగా కలకలం రేపింది. వారి ఆత్మహత్య గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనా.. లేక ఇంకేమైనా కారణాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.

అయితే మణికుట్టన్‌కు చెందిన ఓ తినుబండారాల షాపుపై అధికారులు దాడులు నిర్వహించి, భారీగా జరిమానా విధించినట్లు సమాచారం. జరిమానా విధించడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వారి ఆత్మహత్యపై చుట్టుపక్కలవారి అడిగి తెలుసుకుంటున్నారు. మృతులు మణికుట్టన్‌ (46), ఆయన భార్య సంధ్య (36), కూతురు అమేయ (13), కుమారుడు అజీష్‌ (19), అత్త దేవకి (85)గా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి