చెన్నైలో దారుణం.. దళితుడిని కొట్టి చంపిన వైనం..

|

Feb 16, 2020 | 4:45 PM

చెన్నైలో దారుణం జరిగింది. విల్లుపురం జిల్లా సెంజిలో అగ్రవర్ణాల దాష్టీకం వెలుగులోకొచ్చింది. పొలంలో మూత్ర విసర్జన చేశాడన్న కారణంతో యువకుణ్ణి చావబాదారు అగ్రవర్ణాల పెద్దలు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు..గాయాలతో ఉన్న యువకుణ్ణి ఇంటికి పంపేశారు. ఐతే ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయిన యువకుడు మృతి చెందాడు. దీంతో ఆందోళనకు దిగారు కుటుంబసభ్యులు, దళిత సంఘాలు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చెన్నైలో దారుణం.. దళితుడిని కొట్టి చంపిన వైనం..
Follow us on

చెన్నైలో దారుణం జరిగింది. విల్లుపురం జిల్లా సెంజిలో అగ్రవర్ణాల దాష్టీకం వెలుగులోకొచ్చింది. పొలంలో మూత్ర విసర్జన చేశాడన్న కారణంతో యువకుణ్ణి చావబాదారు అగ్రవర్ణాల పెద్దలు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు..గాయాలతో ఉన్న యువకుణ్ణి ఇంటికి పంపేశారు.

ఐతే ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయిన యువకుడు మృతి చెందాడు. దీంతో ఆందోళనకు దిగారు కుటుంబసభ్యులు, దళిత సంఘాలు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.