మియాపూర్‌లో దారుణం.. భార్య నల్లగా ఉందని హత్య

హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య నల్లగా ఉందని ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ కసాయి భర్త. పెళ్లి అయి ఆరు నెలలు కాకుండానే ఆమెను బలి తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన యోగి, భార్య అరుణతో..

మియాపూర్‌లో దారుణం.. భార్య నల్లగా ఉందని హత్య
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2020 | 8:04 PM

హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య నల్లగా ఉందని ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ కసాయి భర్త. పెళ్లి అయి ఆరు నెలలు కాకుండానే ఆమెను బలి తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన యోగి, భార్య అరుణతో కలిసి మియాపూర్‌లోని గోకుల్ ఫ్లాట్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఇరవై రోజుల క్రితమే అరుణను హైదరాబాద్ తీసుకుని వచ్చాడు యోగి. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న యోగి.. ఓ అమ్మాయిని ప్రేమించాడు.

అయితే ఆ విషయం తెలుసుకున్న యోగి తల్లిదండ్రులు .. మేనకోడలు అరుణని ఇచ్చి ఆరు నెలల క్రితం బలవంతంగా ఈ వివాహం జరిపించారు. ఇష్టం లేని పెళ్లి.. అందులోనూ భార్య అందంగా లేకపోవడంతో అసహనానికి గురైన యోగి.. అరుణతో కాపురం చేయలేక గొంతునులిమి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా గొంతు కోసుకుని సూసైడ్‌కి యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న రక్తపు మడుగులో పడి ఉన్న భార్య భర్తలను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ లోపే అరుణ మృతి చెందగా, యోగి ప్రాణాలతో బయటపడ్డాడు.

Also Read:

శిరసు వంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: బన్నీ

రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు