రాజీవ్ ఖేల్రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు నలుగురు క్రీడాకారులను నామినేట్ చేసింది సెలక్షన్ కమిటీ. ఈ రేసులో క్రికెటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పారా ఒలింపిక్ స్వర్ణపతక విజేత మరియప్పన్ తంగవేలు, టీటీ ప్లేయర్ మానికా బత్రా, రెజ్లర్ వినేవ్ పోగట్లు..
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు నలుగురు క్రీడాకారులను నామినేట్ చేసింది సెలక్షన్ కమిటీ. ఈ రేసులో క్రికెటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పారా ఒలింపిక్ స్వర్ణపతక విజేత మరియప్పన్ తంగవేలు, టీటీ ప్లేయర్ మానికా బత్రా, రెజ్లర్ వినేవ్ పోగట్లు ఉన్నారు. క్రీడా మంత్రిత్వశాఖకు చెందిన సెలక్షన్ కమిటీ ఈ నలుగురి పేర్లను సూచించింది. అత్యున్నత క్రీడా అవార్డుకు నలుగురు ఆటగాళ్లు నామినేట్ కావడం ఇది రెండొవసారి. 2016లో కూడా నలుగురు క్రీడాకారుల్ని ఈ అవార్డు కోసం నామినేట్ చేశారు. కాగా ఈ సెలక్షన్ కమిటీలో వీరేంద్ర సెహ్వాగ్, మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్లు ఉన్నారు.
గత ఏడాది క్రికెటర్ రోహిత్ శర్మ తన బ్యాటింగ్లో మెరుపులు మెరిపించాడు. 2019 సీజన్లో రోహిత్ వన్డేల్లో 7 సెంచరీలు చేయగా, మొత్తం 1490 రన్స్ చేశాడు. ఒకవేళ రోహిత్కు ఖేల్ రత్న అవార్డ్ దక్కితే.. ఆ అవార్డు అందుకున్న నాల్గవ క్రికెటర్గా నిలుస్తాడు. ఇప్పటివరకు సచిన్, ధోనీ, కోహ్లీలు ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక అలాగే రెజ్లర్ వినేశ్ పోగట్ 2018లో కామన్ వెల్త్, ఏషియా గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించారు.
Read More:
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి
మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు