AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..లక్షకు పైగా నగదు సీజ్

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానుల్లో ఒకరకమైన ఉత్కంఠ రేపుతుంటే,.. మరో వైపు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం ఇదే అదునుగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..లక్షకు పైగా నగదు సీజ్
Jyothi Gadda
|

Updated on: Oct 20, 2020 | 1:26 PM

Share

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానుల్లో ఒకరకమైన ఉత్కంఠ రేపుతుంటే,.. మరో వైపు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం ఇదే అదునుగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. కేవలం మ్యాచ్ విజేతలు ఎవరు అనేది మాత్రమే కాకుండా టాస్ ఎవరు గెలుస్తారు, ఏ బ్యాట్స్‌మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు అనే దానితో పాటుగా బాల్ బాల్ కు బెట్టింగ్ వేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం జోరుగా సాగుతోంది. ఓ టైలర్ షాపు వేధికగా బెట్టింగ్ నిర్వహిస్తున్న పాలూరి పాపారావు అనే క్రికెట్ బుకీని అరెస్ట్ చేశారు పోలీసులు. అతని సెల్‌ఫోన్ ఆధారంగా మరో 11 మందిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన క్రికెట్ బెట్టింగ్ ముఠా వద్ద నుండి లక్షా 8 వేల 250 రూపాయల నగదు, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

ఈ వ్యవహారంలో ప్రధాన బుకీ రాజమండ్రికి చెందిన దేవీ శంకర్ అనే వ్యక్తి ఉన్నాడని అందరిపై కేసు నమోదు చేశామని సీఐ అంజనేయులు తెలిపారు. మరెవరైనా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ సమాచారం అందించినా వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రజలు సహకరించాలని తెలిపారు.