అంగట్లో చిన్నారి.. రూ. 22 వేలకు బాబు విక్రయం.. కాదు లక్ష అంటోన్న..

హైదరాబాద్‌లోని జీడిమెట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో రెండు నెలల బాబు విక్రయం సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లాలోని తండాకి చెందిన శేషు..

అంగట్లో చిన్నారి.. రూ. 22 వేలకు బాబు విక్రయం.. కాదు లక్ష అంటోన్న..
childrens missing
Follow us

| Edited By:

Updated on: May 24, 2020 | 12:23 PM

హైదరాబాద్‌లోని జీడిమెట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో రెండు నెలల బాబు విక్రయం సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లాలోని తండాకి చెందిన శేషు.. గాజుల రామారంకు చెందిన సింగ్ అనే వ్యక్తికి బాబును అమ్మడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. నిన్న రాత్రి ఒప్పందం జరిగింది. అయితే ఈ క్రమంలో డబ్బులకు సంబంధించిన వ్యవహారం చెడటంతో.. తన బాబును తమకే ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించాడు శేషు.

అయితే లక్ష రూపాలయలు ఇచ్చి కొనుకున్నామని సింగ్ అనే వ్యక్తి అంటున్నాడు. లేదు అతను అబద్ధాలు చెబుతున్నాడు.. మాకు 22 వేలు మాత్రమే ఇచ్చాడని శేషు.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కి చేరాడు. అయితే పిల్లలని అమ్మడం లేదా కొనడం రెండూ నేరమే కాబట్టి వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.

Read More:

బ్రేకింగ్: మరో బాలీవుడ్ నటుడికి కరోనా పాజిటివ్

మా అమ్మాయికి ప్రభాస్ లాంటోడు కావాలి… అనుష్క తల్లి

రైళ్లను ఎలా శానిటైైజ్ చేస్తున్నారో.. స్పెషల్ వీడియో రిలీజ్