ఇంటికి వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా.. సొత్తు మొత్తం స్వాహా అయింది.. ఎలాగంటే..

| Edited By: Srikar T

Apr 03, 2024 | 3:05 PM

ఈ మధ్యకాలంలో దొంగలకు దొంగతనాలు చేయడం, చాలా తెలికైపోయింది. అలా వచ్చి, ఇలా చేతివాటం చూపించి వెళ్లిపోతున్నారు. పగటి పూట దొంగతనాలకే దొంగలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం.

ఇంటికి వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా.. సొత్తు మొత్తం స్వాహా అయింది.. ఎలాగంటే..
Threft In Kurnool
Follow us on

ఈ మధ్యకాలంలో దొంగలకు దొంగతనాలు చేయడం, చాలా తెలికైపోయింది. అలా వచ్చి, ఇలా చేతివాటం చూపించి వెళ్లిపోతున్నారు. పగటి పూట దొంగతనాలకే దొంగలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని రాఘవేంద్ర కాలనిలో మాధవ్ రెడ్డి, సరితా అనే దంపతులు జీవనం సాగిస్తున్నారు. సరితా ప్రభుత్వ టీచర్‎గా పని చేస్తుండగా, మాధవ్ రెడ్డి ఇంట్లో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే రోజు మాదిరిగా సరితా ఉదయం స్కూల్‎కు వెళ్లగా, మాధవ్ రెడ్డి 11 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి బైక్ రిపేర్ కోసం బయటకు వెళ్ళాడు. అప్పటికే ఆ ఇంటిపై కన్నేసిన ఓ దొంగ వెంటనే ఎంతో చాకచక్యంగా ఇంటికి ఉన్న తాళం తీయకుండా కొక్కికి ఉన్న స్క్రో లను తొలగించాడు. ఇంటిలోకి ప్రవేశించి బెడ్ రూమ్‎లో ఉన్న బీరువా తాళం పగలగొట్టాడు. అందులో ఉన్న 20 తులాల బంగారు నగలు, రెండు లక్షల నగదును అపహరించాడు. ఇంటికి వచ్చిన మాధవ్ రెడ్డి ఇంటి తలుపు తెరిచి ఉండటం, లోపల అన్ని సామాన్లు చెల్లాచెదురుగా ఉండడంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించాడు. వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన స్థలానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రప్పించి విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని నేర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..