అన్నాద‌మ్ముల వివాదం..ప‌ర‌స్ప‌రం క‌త్తుల‌తో దాడి

|

Apr 30, 2020 | 1:05 PM

ఏపీలో ఓ వైపు క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. మ‌రోవైపు లాక్‌డౌన్ క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌ల‌వుతున్నాయి. ఇదిలా ఉండ‌గానే ఏపీలో రెండు కుటుంబాలు క‌త్తులు దూసుకున్నాయి. వ్య‌వ‌సాయ పైప్‌లైన్ విష‌యంలో త‌లెత్తిన వివాదం వేట‌కోడ‌వ‌ళ్ల‌తో ప‌ర‌స్ప‌ర దాడుల‌కు దారితీశాయి. వివ‌రాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ తీవ్ర ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది. గుడిప‌ల్లి మండ‌లం గుండ్ల సాగ‌రం గ్రామానికి చెందిన చంద్ర‌శేఖ‌ర్ స్థానికంగా వ్య‌వ‌సాయం చేసుకుని జీవిస్తున్నాడు. ఈ క్ర‌మంలో త‌న పెద్ద‌నాన్న కుటుంబంతో […]

అన్నాద‌మ్ముల వివాదం..ప‌ర‌స్ప‌రం క‌త్తుల‌తో దాడి
Follow us on
ఏపీలో ఓ వైపు క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. మ‌రోవైపు లాక్‌డౌన్ క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌ల‌వుతున్నాయి. ఇదిలా ఉండ‌గానే ఏపీలో రెండు కుటుంబాలు క‌త్తులు దూసుకున్నాయి. వ్య‌వ‌సాయ పైప్‌లైన్ విష‌యంలో త‌లెత్తిన వివాదం వేట‌కోడ‌వ‌ళ్ల‌తో ప‌ర‌స్ప‌ర దాడుల‌కు దారితీశాయి. వివ‌రాల్లోకి వెళితే..
చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ తీవ్ర ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది. గుడిప‌ల్లి మండ‌లం గుండ్ల సాగ‌రం గ్రామానికి చెందిన చంద్ర‌శేఖ‌ర్ స్థానికంగా వ్య‌వ‌సాయం చేసుకుని జీవిస్తున్నాడు. ఈ క్ర‌మంలో త‌న పెద్ద‌నాన్న కుటుంబంతో వ్య‌వ‌సాయ పొలంలో వేసిన పైప్‌లైన్ విష‌యంలో పంచాయ‌తీ ప‌డింది. మాట‌మాట పెరిగి ఇరుకుటుంబాలు కొట్టుకునే వ‌ర‌కు వెళ్లారు. చంద్ర‌శేఖ‌ర్ కుటుంబంపై క‌ర్ర‌లు, వేట‌కొడ‌వ‌ళ్ల‌తో దాడి చేశారు. ప‌ర‌స్ప‌ర దాడిలో ఇరువురికి తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికుల సాయంతో క్షేత‌గాత్రుల‌ను వెంట‌నే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.