టెన్త్ విద్యార్థులకు గుడ్న్యూస్..పది రోజుల్లో మెమోలు..మార్కులు ఇలాగే !
టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఎస్ఎస్సీ పరీక్షలను రద్దు చేసి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై

టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఎస్ఎస్సీ పరీక్షలను రద్దు చేసి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లు నిర్ణయించి 10 రోజుల్లో మెమోలు తయారు చేయనున్నారు. వీలయినంత త్వరగా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి మార్కుల మెమోలు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.
సాధారణంగా ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాతనే ఎస్ఎస్సీ బోర్డు అధికారులు విద్యార్థులకు మార్కుల జాబితాలను జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి జీవో వచ్చే లోపు అన్నీ మార్కుల మెమోలను సిద్ధం చేసే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. సీసీఈ విధానంలో భాగంగా ఇంటర్నల్ పరీక్షలకు 20 మార్కులు, గ్రేడ్ల విధానం, ప్రయివేటు విద్యార్థులకు వారు చదివిన సంవత్సరంలో పొందిన ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) మార్కుల ప్రకారం గ్రేడింగ్ కేటాయించే విధంగా ఎస్ఎస్సీ ఎగ్జామ్ బోర్డు అధికారులు నివేదిక తయారు చేసినట్లు సమాచారం.
ఈ ముసాయిదా విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం ఆమోదం పొందాక అధికారిక జీవో జారీ అవుతుంది. అనంతరం గతంలో అప్లోడ్ చేసిన ఇంటర్నల్ మార్కులను 100కి లెక్కించి గ్రేడ్లు కేటాయిస్తారు. అదే సమయంలో విద్యార్థుల సౌకర్యార్థం ఎస్ఎస్సీ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం.




