అందరూ అనుకున్నట్లుగానే లాక్డౌన్ను మరో 30 రోజులు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాలలో జూన్ 8 నుంచి ప్రార్ధనా మందిరాలు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో.. వచ్చే నెల 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనాలను ప్రారంభించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేసిన TTD.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. భక్తులకు శ్రీవారి దర్శనాలు కల్పించేందుకు సిద్ధమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అటు శ్రీశైలం ఆలయాన్ని కూడా జూన్ 8 నుంచి తెరవనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. దర్శనానికి వచ్చే భక్తులు క్యూ పద్దతి పాటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని.. దేవాదాయశాఖ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే లాక్ డౌన్ సడలింపులలో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాలను తెరుచుకునేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో ఏపీ దేవాదాయశాఖ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేలా ఎలాంటి నివారణా చర్యలు తీసుకోవాలన్న దానిపై పలు మార్గదర్శకాలను సిద్ధం చేసి వైద్య ఆరోగ్యశాఖ అనుమతి కోసం పంపినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి ఆమోదం పొందిన తర్వాత అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.
మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..