జెనీలియా దంపతుల కీలక నిర్ణయం.. సూపర్ అంటోన్న నెటిజన్లు

| Edited By:

Jul 02, 2020 | 12:47 PM

బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ జెనీలియా, రితేష్ దేశ్‌ముక్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా..

జెనీలియా దంపతుల కీలక నిర్ణయం.. సూపర్ అంటోన్న నెటిజన్లు
Follow us on

బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ జెనీలియా, రితేష్ దేశ్‌ముక్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియా ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో.. రితేష్, జెనీలియా ఇద్దరూ కలిసి మాట్లాడారు. ఆర్గాన్స్ డొనేషన్ గురించి మేము ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం. కానీ ఇప్పటివరకూ కుదరలేదు. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మేము మా అవయవాలను దానం చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. మీరు వేరొకరికి ఇవ్వగలిగిన గొప్ప బహుమతి ఇది తప్ప మరొకటి ఉండదు. కాబట్టి మీరు కూడా ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రండి అంటూ వీడియోలో పేర్కొన్నారు జెనీలియా, రితేష్ జంట. కాగా ఈ పోస్టుకు నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More:

లాక్‌డౌన్ భయం.. సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్..

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..