లాక్డౌన్ భయం.. సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో.. ఆంధ్రా-టీఎస్ సరిహద్దు చెక్పోస్టుల వద్ద భారీగా వాహనాల రద్దీ పెరిగింది. ఏపీకి వెళ్లిన వారు తెలంగాణకి, టీఎస్ నుంచి ఏపీకి ప్రజలు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు చెక్పోస్టుల వద్ద కిలోమీటర్ల మేర...
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో.. ఆంధ్రా-టీఎస్ సరిహద్దు చెక్పోస్టుల వద్ద భారీగా వాహనాల రద్దీ పెరిగింది. ఏపీకి వెళ్లిన వారు తెలంగాణకి, టీఎస్ నుంచి ఏపీకి ప్రజలు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు చెక్పోస్టుల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దాచేపల్లి మండలం పొందుగల చెక్ పోస్ట్, పంతంగి, కొర్లపహాడ్ టోల్ప్లాజా, కృష్ణా, నల్గొండ, హైదరాబాద్-వరంగల్ హైవేపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
అందులోనూ ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సరిహద్దుల్లో ఆంక్షలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే పాసులు ఉంటేనే ఆంధ్రాకి అనుమతిస్తామని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు. అది కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే వాహనాలను ఏపీలోకి అనుమతి ఉంటుందన్నారు. పాసుల కొరకు స్పందన యాప్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇక సరిహద్దు చెక్పోస్టుల వద్దకి రెవెన్యూ సిబ్బంది చేరుకొని ప్రతీ ఒక్కరికీ తనిఖీలు నిర్వహించి హోం క్వారంటైన్ అనే స్టాంప్ వేస్తున్నారు. 14 రోజుల వరకూ క్వారంటైన్లోనే ఉండాలని సూచిస్తున్నారు.
Read More:
విద్యార్థులకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఫ్రీగా లాప్టాప్స్, ఫోన్స్..