విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. స్టూడెంట్స్‌కి ఫ్రీగా ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో స్టూడెంట్స్ డిజిటల్ విద్యను అందించాలని కేంద్రం ప్రణాళికలు...

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 10:31 AM

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. స్టూడెంట్స్‌కి ఫ్రీగా ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో స్టూడెంట్స్ డిజిటల్ విద్యను అందించాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆన్‌లైన్ క్లాసులు వినాలన్నా, కోర్సులు విజయవంతంగా పూర్తి చేయాలన్నా విద్యార్థులకు సొంతంగా డిజిటల్ డివైజ్‌లు అవసరం. దీంతో రూ.15 వేలు విలువ చేసే సాంకేతిక పరికరాలను విద్యార్థులకు అందించాలని మానవ వనరుల అభివృద్ది శాఖ ప్రతిపాదించింది. వచ్చే 5 ఏళ్లలో దేశంలోని అన్ని కాలేజీలు, యూనివర్శిటీల్లో ఎన్‌రోల్ అయ్యే విద్యార్థుల్లో 40 శాతం మందికి ఉచితంగా డిజిటల్ డివైజ్‌లు ఇవ్వనున్నట్లు పేర్కొంది కేంద్రం.

కాగా 2025-26 నాటికి దేశంలోని 4 కోట్ల మంది స్టూడెంట్స్‌కి ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్, ఫోన్స్, టెలివిజన్ సెట్స్ లాంటివి ఇవ్వనుంది కేంద్రం. ఇందు కోసం వచ్చే ఐదేళ్లకు గానూ రూ.60 వేల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.36,473 కోట్లను ఖర్చు చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలు భరించాలి. దీని ద్వారా 4 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం పేర్కొంది.

Read More: 

జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ వీడియో.. స్కూల్‌ ఏజ్‌లోనే అదరగొట్టాడు..

పోలీసులకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫిర్యాదు..