AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వ్యాక్సిన్ వస్తే ముందు వాళ్లకే.. ప్రధాని కీలక సూచనలు

ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటి క్రితమే జాతినుద్ధేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అన్‌లాక్ 2.0, మాస్క్ వినియోగం గురించి ప్రస్తావించారు. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలందరికీ నవంబర్‌ వరకూ ఫ్రీ రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్షా..

కరోనా వ్యాక్సిన్ వస్తే ముందు వాళ్లకే.. ప్రధాని కీలక సూచనలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 30, 2020 | 7:00 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటి క్రితమే జాతినుద్ధేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అన్‌లాక్ 2.0, మాస్క్ వినియోగం గురించి ప్రస్తావించారు. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలందరికీ నవంబర్‌ వరకూ ఫ్రీ రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కోవిడ్‌‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందుగా మహామ్మారితో పోరాడుతున్న వైద్య సిబ్బందితో పాటు వైరస్ ముప్పున ప్రజలకు టీకా ఇవ్వాలని అన్నారు ప్రధాని మోదీ.

అలాగే వాక్సిన్ తయారైతే వాటిని దేశమంతటా ఎలా పంపిణీ చేయాలి?  ముందుగా ఎవరికి వ్యాక్సిన్ ముందు ఇవ్వాలి? అని వివిధ డిపార్ట్‌మెంట్ల‌ మధ్య సమన్వయం ఎలా ఉండాలన్నదానిపై అధికారులు మార్గదర్శకాలు సూచించారు ప్రధాని మోదీ.

1. కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి, వృద్ధులకు, చిన్న పిల్లలకు ముందుగా టీకాలు ఇవ్వాలి. 2. దేశంలోని ప్రతీ పౌరునికీ, ప్రాంతానికి వ్యాక్సిన్ సరఫరా అయ్యేలా కార్యాచరణ రూపొందించాలి. 3. కరోనా టీకాలు సరసమైన ధరలకే అందుబాటులో ఉండాలి. అధిక ధరల కారణంగా ఎవరూ వ్యాక్సిన్‌కు దూరం కాకూడదు. 4. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి నుంచి పంపిణీ వరకూ అన్నింటినీ స్పెషల్ టెక్నాలజీ సహాయంతో పర్యావేక్షించాలి.

కాగా ఇక ప్రపంచ వ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం నిరంతం శ్రమిస్తున్న విషయం తెసిందే. ఇప్పటికే చాలా సంస్థల వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయి.

Read More: 

కేంద్రం స్టన్నింగ్ డెసిషన్.. మరి ఇన్‌స్టాల్‌ చేసిన యాప్స్ పనిచేస్తాయా?

బ్రేకింగ్: లాక్‌ డౌన్‌పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు..