AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో తగ్గని కరోనా కేసులు.. తాజా వివరాలు ఇవే..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహరాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇప్పటికే..

మహారాష్ట్రలో తగ్గని కరోనా కేసులు.. తాజా వివరాలు ఇవే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 12, 2020 | 7:35 PM

Share

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహరాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇప్పటికే రెండున్నర లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆదివారం నాడు కొత్తగా 7,827 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,427కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.40 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 173 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత పూణె, థానే నగరాల్లో నమోదవుతున్నాయి.